షాద్ నగర్ నియోజకవర్గంలో బ్రాహ్మణ కుటుంబాలు ఉప నయనాలు, వివాహాలకు చేసుకోడానికి భవనం లేదని తక్షణమే ఆ అవసరం తీర్చాలని బ్రాహ్మణ సంఘం సభ్యులు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ను కోరారు. కార్యక్రమాలు జరుపుకోవడానికి వేయి గజాల స్థలము, ఆర్థికంగా నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి ఆర్థిక సాయం చేయాల్సిందిగా కోరారు.
ఈ సందర్భంగా బ్రాహ్మణుల సమస్యలను తప్పకుండా త్వరలో పరిష్కరిస్తానని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తెలిపారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి లను బ్రాహ్మణ సంఘ సభ్యులు శాలువతో సన్మానించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుడు సుజీవన్, సంఘ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి పూర్ణచంద్ర, వేణుగోపాలకృష్ణ చిలుకూరి రామ్ సత్యనారాయణ శర్మ, ప్రవీణ్ కుమార్ రఘుపతిరావు రాదేశం,రవి శర్మ, భాను శర్మ రాజశేఖర్ శర్మ కమల్ కిషోర్ శర్మ వసుంధర రాజగోపాల్ మనోజ్ కుమార్ రాజేష్ సుదర్శన్ రావు కృష్ణమోహన్ శ్రీనివాసరావు కమల సౌమ్య శిరీష గాయత్రి గీత వాణి న్యాయాసలదారులు నర్వ వేణుగోపాలరావు తదితరులు పాల్గొన్నారు.
