వనపర్తి జిల్లా కేంద్రంలో పది వేల రూపాయలు లంచం తీసుకున్న జిల్లా వ్యవసాయ శాఖదికారి ఆంజనేయులు గౌడును ఎ సి బి అధికారులు పట్టుకున్నారు. తెలంగాణలో వనపర్తి జిల్లా ఏర్పాటు అయిన తర్వాత జిల్లా స్థాయి అధికారులు ఎసిబి అధికారులకు పట్టుబడటం చర్చనీయంశంగా మారింది.
జిల్లాలో నెల మామూళ్లు, బ్రోకర్ల ద్వారా లంచాలు తీసుకునే వారిని రహస్య విచారణ చేసి పట్టుకోవాలని నిజాయితీపరులు కోరారు. ప్రస్తుతం ఎసిబిలో పట్టుబడిన అధికారులకు కోర్టులో శిక్ష పడటం, డిస్మిస్ కావడం ఖాయం. అయినా అవినీతి అధికారులకు భయం లేదు.
పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్
