కర్నూలుహోమ్

అహోబిలం పారువేట ఉత్సవంకు యూనెస్కో గుర్తింపు

#ByreddySabari

భారత పార్లమెంట్ లో అహోబిలం పారువేట ఉత్సవానికి యునెస్కో  వారసత్వ గుర్తింపు కోసం నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్  ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి కేంద్ర ప్రభుత్వం కు విన్నవించారు.

ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లా, ఆళ్ళగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం, నల్లమల కొండలలోని అహోబిలం ఆలయంఉందని, శ్రీ లక్ష్మి నరసింహ స్వామికి అంకితం చేయబడిన అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో ఒకటి అహోబిలం అని, నరసింహస్వామి తన ఉగ్రరూపంతో అవతరించిన ప్రదేశంగా అహోబిలంను పూజిస్తారని, ప్రహ్లాదుడిని రక్షించి, చెడును సంహరించడానికి. నవ నరసింహ అని పిలువబడే నరసింహుని తొమ్మిది రూపాలతో కూడిన ఈ అహోబిలం ఆలయం భక్తి, ధైర్యం,  దైవ కృపకు ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు.

అహోబిలంలోని అటవీ సమీప ప్రాంతంలో ఉన్న 33 గ్రామాలలో 40 రోజుల పాటు ‘పారువేట ఉత్సవం’ అనే ఒక ప్రత్యేకమైన పండుగను జరుపుకుంటారని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు. ఆరు శతాబ్దాలకు పైగా కొనసాగుతున్న ఈ పారువేట ఉత్సవ పండుగ, విశ్వాసం, భక్తి, సామాజిక,  మత సామరస్యానికి ఒక విశిష్ట ఉదాహరణ  అని తెలిపారు.

భక్తులను ఆశీర్వదించడానికి మహా అవతార్ నరసింహ విగ్రహాన్ని ప్రతి వీధికి, ప్రతి ఇంటికి ఊరేగిస్తారని,  చెంచు గిరిజన సమాజానికి ఆ దేవుడితో ఒక ప్రత్యేకమైన సాంస్కృతిక అనుబంధం ఉందని. ఎందుకంటే, రాక్షస రాజు హిరణ్యకశిపుడిని సంహరించి, ప్రహ్లాదుడిని రక్షించిన తరువాత, ఆ దేవుడు చెంచు లక్ష్మిని వివాహం చేసుకున్నాడని నమ్ముతారన్నారు.

పారువేట ఉత్సవం దాని విశిష్టత కారణంగా ఒక సజీవ సంప్రదాయానికి ప్రతీకగా నిలుస్తుందని. ఆరు శతాబ్దాలకు పైగా వారసత్వంగా వస్తున్న ఈ జ్ఞానం, నైపుణ్యం యునెస్కో వారి మానవజాతి అమూర్త సాంస్కృతిక వారసత్వంగా గుర్తింపు పొందడానికి అర్హమైనదని,  ఇది మౌఖిక సంప్రదాయాలను, ఆలయ ఆచారాలను, సామూహిక భాగస్వామ్యాన్ని తరతరాలుగా విశ్వాసం సంక్రమించడాన్ని పరిరక్షిస్తుందని వివరించారు.

అడ్డంకులను తొలగించి, సామూహిక గుర్తింపును బలోపేతం చేయడం ద్వారా సామాజిక సామరస్యాన్ని ప్రోత్సహిస్తుందని. శతాబ్దాల నాటి ఈ ఆచారం సమాజానికి భిన్నత్వంలో ఏకత్వాన్ని గుర్తు చేస్తుందని. దీనిని ప్రపంచ స్థాయిలో గుర్తించడం ద్వారా ఈ ప్రాచీన సంప్రదాయాన్ని పరిరక్షించడమే కాకుండా, శాంతి, భక్తి,  ఐక్యతను ప్రేరేపిస్తూనే ఉన్న భారతదేశపు సజీవ ఆధ్యాత్మిక వారసత్వాన్ని కూడా మనం గౌరవించినట్లు అవుతుందని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి లోక్ సభ దృష్టికి తెచ్చారు.

అహోబిలం పారువేట ఉత్సవానికి యునెస్కో సాంస్కృతిక వారసత్వ హోదాను సిఫార్సు చేయాలని  భారత ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నానని  నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి లోక్ సభలో విన్నవించారు.

Related posts

మమతా బెనర్జీపై ఆరోపణలు గుప్పించిన అమిత్ షా

Satyam News

తెలంగాణలో ప్రైవేటు సమీకృత ఆయిల్ పామ్ కాంప్లెక్స్

Satyam News

బైక్ రైడర్స్ పై కఠిన చర్యలు తీసుకుంటాం

Satyam News

ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడొద్దు

Satyam News

విజయ్ జన నాయకన్ చిత్రానికి మళ్లీ అడ్డంకులు

Satyam News

డాక్టర్ ప్రియాంకపై దాడిని ఖండించిన ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి

Satyam News

Leave a Comment