ప్రత్యేకంహోమ్

సమస్యల వలయంలో చిక్కుకున్న ఎయిర్ టెల్

#Airtel

దేశంలోని అన్ని మొబైల్ నెట్ వర్క్ లు ఒక్క సారిగా సమస్యల వలయంలో చిక్కుకున్నాయి. సోమవారం భారతదేశంలో అన్ని మొబైల్ నెట్‌వర్క్ వినియోగదారులు దీర్ఘకాలిక అంతరాయం ఎదుర్కొన్నారు. ప్రధానంగా ఎయిర్‌టెల్‌తో ప్రారంభమై, కొంతమేరకు జియో మరియు వోడాఫోన్-ఐడియాకు కూడా ఈ సమస్య విస్తరించింది.

డౌన్‌ డిటెక్టర్ ప్రకారం, ఎయిర్‌టెల్‌లో ఎక్కువగా ఫిర్యాదుల వచ్చాయి అందిన ఫిర్యాదులు అన్నీ కూడా మొబైల్ ఫోన్ కాల్స్‌కు సంబంధించినవే. తరువాత సిగ్నల్ కోల్పోవడం, ఇంటర్నెట్ సమస్యలు నమోదయ్యాయి. ఈ సమస్య తొలుత ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో గుర్తించబడింది. తర్వాత ముంబై, బెంగళూరులోనూ, ఆపై దేశవ్యాప్తంగా విస్తరించింది.

కంపెనీ విడుదల చేసిన ప్రకటనలో, “మా ఢిల్లీ-ఎన్‌సీఆర్ కస్టమర్లు గత గంట నుంచి వాయిస్ కాలింగ్ సమస్యలను ఎదుర్కొంటున్నారు. సమస్యలోని ప్రధాన భాగాన్ని ఇప్పటికే పరిష్కరించాం. మా ఇంజనీర్లు దీన్ని పూర్తిగా సరిచేయడానికి కృషి చేస్తున్నారు. కలిగిన అసౌకర్యానికి మేము చింతిస్తున్నాం” అని పేర్కొంది.

టెక్ సమస్యలను పర్యవేక్షించే డౌన్‌డిటెక్టర్ పోర్టల్ ప్రకారం, సోమవారం సాయంత్రం 4:32 గంటల సమయంలో ఎయిర్‌టెల్ అవుటేజ్‌కు సంబంధించి 3,600 పైగా ఫిర్యాదులు నమోదయ్యాయి. సాధారణంగా 15 లోపే ఉండే బేస్‌లైన్‌తో పోలిస్తే ఇది భారీగా పెరిగింది. అయితే, సాయంత్రం 6:40 గంటలకు ఫిర్యాదులు 400 కంటే తక్కువకు తగ్గాయి. ఇప్పుడు కస్టమర్లు సేవలు పునరుద్ధరించబడ్డాయని ఎయిర్‌టెల్ నుంచి సందేశాలు అందుకుంటున్నారు.

Related posts

22, 23న గద్వాల, వనపర్తి కి సమాచార కమిషనర్ల రాక

Satyam News

సినీ నటి జయవాహిని కన్నుమూత

Satyam News

బీసీ మహిళలకు ఆటోమేటిక్ కుట్టు మిషన్ లు

Satyam News

అంబర్‌పేట్ లో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి

Satyam News

శ్రీశ్రీశ్రీ పైడిత‌ల్లి జాత‌ర‌కు ఉగ్రవాదుల ముప్పు?

Satyam News

గణనాథుని సేవించే మహా పర్వదినం

Satyam News

Leave a Comment