మహబూబ్ నగర్హోమ్

ఆర్థిక నేరం కేసులో రమేష్ అరెస్ట్

#TelanganaPolice

బ్యాంకులను మోసం చేసి కోట్ల రూపాయల రుణం పొంది ఆర్థిక నేరానికి పాల్పడిన కేసులో నిందితులకు లబ్ది చేకూర్చాలని చేసిన కుట్రలో భాగస్వామ్యం ఉండటంతో రమేష్ అనే వ్యక్తిని వనపర్తి  అరెస్ట్ చేశామని వనపర్తి పోలీస్ సిఐ కృష్ణ తెలిపారు. వనపర్తి పట్టణానికి చెందిన పోలీస్ కానిస్టేబుల్ రాకేష్ కేసులో కుట్ర పూరితంగా వ్యవహరించినందుకు నిందితుడైన  వనపర్తి పట్టణ వాసి  రమేష్ ను వనపర్తి పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

బ్యాంకులను మోసం చేయడానికి బ్యాంక్ నుండి పొందిన రుణంతో వేరే ఆస్తులు కొని రాకేష్ కు సహకరించడం కోసం   రమేష్ ఏజిపిఏ చేసుకున్నట్లు గుర్తించామని సీఐ తెలిపారు. రాకేష్ చేసిన ఆర్థిక నేరంలో రమేష్ కుట్రలో భాగస్వామ్యం ఉందని విచారణలో తేలినందున అరెస్ట్ చేసి రిమాండ్ చేశామని అన్నారు. ప్రభుత్వ సంస్థలు లేదా ప్రైవేటు సంస్థలను వ్యక్తులను ఉద్దేశపూర్వకంగా కుట్రచేసి మోసం చేస్తే ఎంతటి వారికైనా చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

మహిళా డాక్టర్ కు లైంగిక వేధింపులు: ఆత్మహత్య

Satyam News

రూ.38 లక్షల విలువైన అభివృద్ధి పనుల ప్రారంభం

Satyam News

ఘనంగా హైదరాబాద్ సిటీ పోలీసుల హోలీ వేడుకలు

Satyam News

విలక్షణ  దర్శకుడు డాక్టర్ పి సి ఆదిత్య కు వందేమాతరం అవార్డు

Satyam News

సింగపూర్ పర్యటనలో సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం

Satyam News

చంద్రబాబు ప్రతిపాదనపై అమిత్ షా స్పందన ఏమిటి?

Satyam News

Leave a Comment