తూర్పుగోదావరిహోమ్

రాజమండ్రి జైలు నుంచి అంబటి రాంబాబు తరలింపు

#AmbatiRambabuNew

మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కాపు నాయకుడిగా చెప్పుకుంటున్న అంబటి రాంబాబును పోలీసులు శనివారం రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి గుంటూరుకు తరలించారు. గత ఏడాది నవంబర్ 12న జరిగిన ఒక ఆందోళన కార్యక్రమానికి సంబంధించి నమోదైన కేసులో పీటీ (Prisoner Transit) వారెంట్‌పై పోలీసులు ఈ చర్య తీసుకున్నారు.

గతేడాది నవంబర్ 12న వైసీపీ చేపట్టిన ఆందోళనలో భాగంగా పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆ సమయంలో అంబటి రాంబాబు బారికేడ్లను తోసుకుంటూ ముందుకు వెళ్లడం, పోలీసుల విధులకు ఆటంకం కలిగించడం వంటి ఆరోపణలపై ఆయనపై కేసు నమోదైంది.

ఈ కేసులో విచారణ నిమిత్తం పోలీసులు ఆయనను రాజమండ్రి జైలు నుంచి గుంటూరుకు తరలిస్తున్నారు.గుంటూరుకు చేరుకున్న అనంతరం అంబటి రాంబాబును పోలీసులు స్థానిక కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఈ సందర్భంగా ఆయన కస్టడీ కోసం పోలీసులు పిటిషన్ వేయగా, అంబటి తరపు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది.

వీటిపై కోర్టులో సుదీర్ఘ విచారణ జరిగే అవకాశం ఉంది.ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ఇప్పటికే అంబటి రాంబాబు రిమాండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. కాగా, ఆయనపై రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు 40కి పైగా కేసులు నమోదైనట్లు సమాచారం. వరుసగా పీటీ వారెంట్లు జారీ అవుతుండటంతో అంబటి రాజకీయంగా మరియు న్యాయపరంగా మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Related posts

మంత్రి నారా లోకేష్ 85వ రోజు ప్రజాదర్బార్..

Satyam News

విద్యార్థుల కోసం ప్రత్యేక డిజిటల్ హెల్త్ పోర్టల్

Satyam News

కూకట్ పల్లిలో శ్రీ జగన్నాథ్ రథయాత్ర

Satyam News

తమిళనాడు ఎన్నికల్లో విజయ్ ప్రభావం ఏ మేరకు?

Satyam News

రేపు పవన్ కల్యాణ్ పిఠాపురం పర్యటన

Satyam News

ప్రధాని మోడీ పర్వటనకు ముస్తాబవుతున్న భోగాపురం ఏర్ పోర్ట్

Satyam News

Leave a Comment