హోర్ముజ్ జలసంధి గుండా అమెరికా నౌకాదళం ఒక చమురు ట్యాంకర్కు రక్షణగా (ఎస్కోర్ట్) వెళ్ళిందంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదని శ్వేతసౌధం స్పష్టం చేసింది. ఇంధన శాఖ కార్యదర్శి క్రిస్ రైట్ అంతకుముందు చేసిన ఒక పోస్ట్లో అమెరికా నౌకాదళం ఒక ట్యాంకర్కు రక్షణ కల్పించిందని పేర్కొన్నారు.
అయితే ఆ సమాచారం తప్పు అని తేలడంతో శ్వేతసౌధం దానిని ఉపసంహరించుకుంది. ఈ విషయంపై ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ అధికారికంగా స్పందిస్తూ, ఇప్పటివరకు అమెరికా నౌకాదళం ఏ చమురు ట్యాంకర్కు లేదా మరే ఇతర నౌకకు రక్షణగా వెళ్లలేదని స్పష్టం చేశారు. తప్పుడు సమాచారంతో కూడిన ఆ పాత పోస్ట్ను ఇప్పటికే తొలగించినట్లు శ్వేతసౌధం అంగీకరించింది.
