అమెరికా చేపట్టిన ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’లో భాగంగా ఇరాన్ లక్ష్యంగా అత్యంత శక్తివంతమైన బి-2 స్టీల్త్ బాంబర్లు గాలిలోకి ఎగిరాయి. ఇరాన్ పాలన యంత్రాంగం నుండి ఎదురవుతున్న ప్రస్తుత ముప్పును తొలగించడంతో పాటు, భవిష్యత్తులో ఆ దేశం తన సైనిక సామర్థ్యాన్ని తిరిగి పునర్నిర్మించుకోకుండా చేయడమే ప్రధాన లక్ష్యంగా ఈ సుదూర శ్రేణి దాడులను నిర్వహిస్తున్నారు.
ఈ ఆపరేషన్లో భాగంగా అమెరికా వైమానిక దళం ఇరాన్లోని వ్యూహాత్మక క్షిపణి కేంద్రాలు, భూగర్భ ఆయుధ గారాలు, రక్షణ తయారీ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని బాంబుల వర్షం కురిపిస్తోంది.
అమెరికా రక్షణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ బి-2 స్టీల్త్ బాంబర్లు సుదీర్ఘ ప్రయాణం చేసి అత్యంత ఖచ్చితత్వంతో కూడిన దాడులను అమలు చేస్తున్నాయి. ఇరాన్ అణ్వాయుధ తయారీ సామర్థ్యాన్ని, క్షిపణి ఉత్పత్తి కేంద్రాలను పూర్తిగా తుడిచిపెట్టడం ద్వారా ఆ దేశం మళ్లీ కోలుకోలేని విధంగా దెబ్బతీయాలని అగ్రరాజ్యం భావిస్తోంది.
ఫిబ్రవరి చివరలో ప్రారంభమైన ఈ భారీ సైనిక చర్యలో ఇప్పటికే వేల సంఖ్యలో ఇరాన్ రక్షణ లక్ష్యాలను అమెరికా ధ్వంసం చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో మధ్య ప్రాచ్యంలో యుద్ధ వాతావరణం నెలకొనగా, అగ్రరాజ్యం తన మిత్రదేశాలతో కలిసి ఇరాన్ సైనిక పటాన్ని మార్చేసే దిశగా అడుగులు వేస్తోంది.
