రంగారెడ్డి హోమ్

భార్య విగ్రహంతో పాటు తన విగ్రహాన్ని ఆవిష్కరించిన 89 ఏళ్ల రైతు

#Chilukuru

చిలుకూరులో   స్థిరపడ్డ 89 ఏళ్ల కళ్లెం నర్సింహా రెడ్డి భార్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తూ కన్నీరు మున్నీరు అయ్యారు. కూతుళ్ళు, బంధువుల సమక్షంలో భార్య విగ్రహంతో పాటు తన విగ్రహాన్ని ఆవిష్కరించారు. చిలుకూరు లో తన వ్యవసాయ క్షేత్రం లో ఈ విగ్రహాలను ఆవిష్కరించారు. భార్య లక్ష్మీ ప్రథమ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు.

ముప్పై ఏళ్లపాటు అమెరికాలో వ్యవసాయం చేసిన కళ్లెం నర్సింహా రెడ్డి ఇండియాకు తిరిగివచ్చి చిలుకూరు లో స్థిరప డ్డారు. ఉత్తమ వ్యవసాయ పద్దతులు అమలు చేసి అప్పటి అమెరికా ప్రెసిడెంట్ జిమ్మీ కార్టర్ తో అవార్డు అందుకున్నారు. తనకు తోడుగా ఉన్న భార్య లక్ష్మి చనిపోవడంతో  వొంటరిగా మారారు. భార్యను మరచిపోకుండా ఉండేందుకు విగ్రహం ఏర్పాటు చేసుకున్నారు. ఆమె వంటరి కాదు తాను తోడు ఉంటానని ఆమె పక్కనే తన విగ్రహాన్ని పెట్టుకున్నారు.

Related posts

కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేయండి

Satyam News

పులివెందులలో వైసీపీ నేతల సైకిల్ సవారీ

Satyam News

ఏపీకి మరో 2 ఐటీ కంపెనీలు..

Satyam News

Leave a Comment

error: Content is protected !!