రంగారెడ్డిహోమ్

భార్య విగ్రహంతో పాటు తన విగ్రహాన్ని ఆవిష్కరించిన 89 ఏళ్ల రైతు

#Chilukuru

చిలుకూరులో   స్థిరపడ్డ 89 ఏళ్ల కళ్లెం నర్సింహా రెడ్డి భార్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తూ కన్నీరు మున్నీరు అయ్యారు. కూతుళ్ళు, బంధువుల సమక్షంలో భార్య విగ్రహంతో పాటు తన విగ్రహాన్ని ఆవిష్కరించారు. చిలుకూరు లో తన వ్యవసాయ క్షేత్రం లో ఈ విగ్రహాలను ఆవిష్కరించారు. భార్య లక్ష్మీ ప్రథమ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు.

ముప్పై ఏళ్లపాటు అమెరికాలో వ్యవసాయం చేసిన కళ్లెం నర్సింహా రెడ్డి ఇండియాకు తిరిగివచ్చి చిలుకూరు లో స్థిరప డ్డారు. ఉత్తమ వ్యవసాయ పద్దతులు అమలు చేసి అప్పటి అమెరికా ప్రెసిడెంట్ జిమ్మీ కార్టర్ తో అవార్డు అందుకున్నారు. తనకు తోడుగా ఉన్న భార్య లక్ష్మి చనిపోవడంతో  వొంటరిగా మారారు. భార్యను మరచిపోకుండా ఉండేందుకు విగ్రహం ఏర్పాటు చేసుకున్నారు. ఆమె వంటరి కాదు తాను తోడు ఉంటానని ఆమె పక్కనే తన విగ్రహాన్ని పెట్టుకున్నారు.

Related posts

“లవ్ ఇన్సూరెన్స్” ఈ పదం విన్నారా?

Satyam News

ప్రభుత్వ స్థలం అక్రమిస్తే కఠినమైన చర్యలు

Satyam News

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయం తోనే సమగ్ర క్రీడాభివృద్ధి

Satyam News

కాంక్రీట్ జంగిల్ మధ్య ‘గ్రీన్ లంగ్స్’గా నగర వనాలు

Satyam News

రెండో విడత రైతు భరోసా నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్

Satyam News

ఉత్తరాంధ్ర భారీవర్షాలపై జిల్లా కలెక్టర్లకు సీఎం ఆదేశం

Satyam News

Leave a Comment