26.7 C
Hyderabad
September 20, 2026
రంగారెడ్డిహోమ్

భార్య విగ్రహంతో పాటు తన విగ్రహాన్ని ఆవిష్కరించిన 89 ఏళ్ల రైతు

#Chilukuru

చిలుకూరులో   స్థిరపడ్డ 89 ఏళ్ల కళ్లెం నర్సింహా రెడ్డి భార్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తూ కన్నీరు మున్నీరు అయ్యారు. కూతుళ్ళు, బంధువుల సమక్షంలో భార్య విగ్రహంతో పాటు తన విగ్రహాన్ని ఆవిష్కరించారు. చిలుకూరు లో తన వ్యవసాయ క్షేత్రం లో ఈ విగ్రహాలను ఆవిష్కరించారు. భార్య లక్ష్మీ ప్రథమ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు.

ముప్పై ఏళ్లపాటు అమెరికాలో వ్యవసాయం చేసిన కళ్లెం నర్సింహా రెడ్డి ఇండియాకు తిరిగివచ్చి చిలుకూరు లో స్థిరప డ్డారు. ఉత్తమ వ్యవసాయ పద్దతులు అమలు చేసి అప్పటి అమెరికా ప్రెసిడెంట్ జిమ్మీ కార్టర్ తో అవార్డు అందుకున్నారు. తనకు తోడుగా ఉన్న భార్య లక్ష్మి చనిపోవడంతో  వొంటరిగా మారారు. భార్యను మరచిపోకుండా ఉండేందుకు విగ్రహం ఏర్పాటు చేసుకున్నారు. ఆమె వంటరి కాదు తాను తోడు ఉంటానని ఆమె పక్కనే తన విగ్రహాన్ని పెట్టుకున్నారు.

Related posts

కడియం శ్రీహరి వ్యవహారశైలిపై మంత్రి కొండా సురేఖ ఫిర్యాదు

Satyam News

యూరియా కొరతకు కారణం ఏమిటి

Satyam News

పెండింగ్ పనుల పూర్తికి ప్రాధాన్యత

Satyam News

ఇప్పుడు… మీ రోజువారీ స్టైల్‌కి కూడా లగ్జరీ టచ్

Satyam News

పారిశ్రామికవేత్తల కోసం వారానికి ఒక రోజు కేటాయిస్తా

Satyam News

మైనర్ బాలిక దారుణ హత్య: ఉద్రిక్తత

Satyam News

Leave a Comment