ఖమ్మంహోమ్

ఇంటి స్థలం కోసం మంత్రిని కలిసిన తెలంగాణ ఉద్యమకారులు

#Ponguleti

కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం ఇస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చాలని తెలంగాణ ఉద్యమకారుల సంఘం వ్యవస్థాపకులు డాక్టర్ పిడమర్తి రవి ఆధ్వర్యంలో ఉద్యమకారులు కలిశారు. ఈ సందర్భంగా పిడమర్తి రవి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో జైలుకు వెళ్లినవారు, జైలుకు వెళ్ళని వారు, ఉద్యమంలో పాల్గొన్న వారి కి అందరికీ 250 గజాల ఇంటి స్థలం కేటాయించాలని అన్నారు.

చాలామంది ఉద్యమకారులపై కేసులు కాలేదని అలాంటి వారిని కూడా గుర్తించి 250 గజాల ఇంటి స్థలానికి లబ్ధిదారులుగా చేకూర్చాలని విజ్ఞప్తి చేశారు. 250 గజాల ఇంటి స్థలం కోసం ప్రత్యేకమైన మంత్రివర్గ ఉపసంఘం వేయాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యమకారులను గత ప్రభుత్వం గుర్తించలేదని తద్వారా ఉద్యమకారులు తీవ్రంగా నష్టపోయారని చాలామంది ఉద్యమకారులకు ఆరోగ్య సమస్యలు వచ్చి  ఎలాంటి పనులు చేసుకోలేని స్థితిలో ఉన్నారని అలాంటి ఉద్యమకారులందర్నీ గుర్తించి రెండు వందల యాభై గజాల స్థలంతో పాటు ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అన్నింటిని నెరవేర్చాలని కోరారు.

త్వరలో అన్ని జిల్లాలలో పర్యటించి ఉద్యమకారులను కలుస్తానని పిడమర్తి రవి తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్స్ డాక్టర్ బొమ్మెర స్టాలిన్, BSF రాష్ట్ర అధ్యక్షులు బోరెల్లి సురేష్, ఉద్యమకారులు నక్క మహేష్ జోగు గణేష్ మీసాల మహేష్ ,కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Related posts

పేద ముస్లిం పిల్లల సామూహిక ఖత్నా కార్యక్రమం

Satyam News

తిరుమల కిట కిట.. జగన్‌ కట కట..!!

Satyam News

రేపు రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు

Satyam News

దక్షిణ మధ్య రైల్వేకు జాతీయ సిగ్నల్ & టెలికమ్యూనికేషన్ అవార్డు

Satyam News

శ్రీశ్రీశ్రీ పైడిత‌ల్లి అమ్మ‌వారి ఆల‌య  విస్త‌ర‌ణ ప‌నులు

Satyam News

కల్తీ మద్యం కట్టడికి “ఏపీ ఎక్సైజ్ సురక్ష” యాప్

Satyam News

Leave a Comment