కృష్ణహోమ్

ఎపి సిఎస్ సాయి ప్రసాద్ పదవీ కాలం పొడిగింపు

#SaiprasadIAS

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం మరో ఆరు మాసాలు అనగా జూన్ 1 నుండి నవంబరు 30 వరకు పొడింగించింది.రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్ధన మేరకు కేంద్ర ప్రభుత్వం ఇందుకు ఆమోదం తెలిపింది. ఈమేరకు ఆల్ ఇండియా సర్వీసెస్(AIS) రూల్ 16(1)(DCRB)రూల్స్ 1958 కు అనుగుణంగా సిఎస్ సాయి ప్రసాద్ పదవీ కాలాన్ని ఆరు మాసాలకు పొడిగిస్తూ కేంద్ర డిపార్టుమెంట్ ఆఫ్ పెర్సనల్ అండ్ ట్రైనింగ్(డిఓపిటి)మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరి రాజేశ్ కుమార్ యాదవ్ రాష్ట్ర ప్రభుత్వ సాధారణ పరిపపాలన శాఖ(పొలిటికల్)ముఖ్య కార్యదర్శికి లేఖ ద్వారా తెలియ జేశారు.

ప్రస్తుతం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేస్తున్న సాయి ప్రసాద్ వాస్తవానికి ఈనెలాఖరున పదవీ విరమణ చేయాల్సి ఉండగా ఆయన సేవలను మరికొంత కాలం వినియోగించుకోవాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం సిఎస్ పదవీ కాలాన్ని పొడిగించాల్సిందిగా కేంద్రానికి ప్రతిపాదనలు పంపగా ఆమేరకు కేంద్ర ప్రభుత్వం సాయి ప్రసాద్ పదవీ కాలాన్ని ఆరు మాసాలు అనగా జూన్ 1 నుండి నవంబరు 30వ తేదీ వరకూ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Related posts

ఐ బొమ్మ ఆగినా పైరసీ ఆగలేదు…

Satyam News

మహిళల సమస్యల సత్వర పరిష్కారానికి ఆన్ లైన్ పోర్టల్

Satyam News

కోల్డ్రిఫ్ దగ్గు మందు తయారీదారుడి అరెస్టు

Satyam News

ఫేస్ బుక్ కు కష్టకాలం: జుకర్‌బర్గ్ కు మోడీ ప్రభుత్వం వార్నింగ్

Satyam News

డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ పైలెట్‌ ప్రాజెక్టుగా సంగారెడ్డి జిల్లా

Satyam News

ప్రభుత్వ అధికారిని వీడియోలతో బ్లాక్ మెయిల్ చేసిన మహిళ

Satyam News

Leave a Comment