జాతీయంహోమ్

నాగపూర్ లో పేలుడు: 15 మంది మృతి

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఆదివారం తెల్లవారుజామున ఒక భారీ పేలుడు సంభవించి పెను విషాదాన్ని నింపింది. నాగ్‌పూర్‌లోని ఎస్.బి.ఎల్ (SBL) ఎనర్జీకి చెందిన బి-20 ప్లాంట్‌లో జరిగిన ఈ శక్తివంతమైన పేలుడులో కనీసం 15 మంది మరణించగా, మరో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదం తెల్లవారుజామున సుమారు 5:30 గంటల సమయంలో చోటుచేసుకుంది. పేలుడు తీవ్రతకు పక్కనే ఉన్న బి-16 ప్లాంట్ కూడా దెబ్బతినడమే కాకుండా, అక్కడి కాంక్రీట్ కట్టడాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి.

ప్రాథమిక సమాచారం ప్రకారం, డెటొనేటర్‌కు వైరును కలుపుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఘటనా స్థలంలో సహాయక బృందాలు శిథిలాలను తొలగించే పనులను ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి. శిథిలాల కింద మరికొంతమంది చిక్కుకుని ఉండవచ్చని, మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పేలుడు ధాటికి వచ్చిన శబ్దం కొన్ని కిలోమీటర్ల మేర వినిపించిందని ఎస్పీ హర్ష పొద్దార్ తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

Related posts

సింగరేణిలో సహజ మరణానికి కూడా 10 లక్షల ఉచిత బీమా

Satyam News

ఉత్తరాంధ్రలో భారీ వర్షాల హెచ్చరిక

Satyam News

రికార్డు స్థాయిలో మేడారం జాతరకు వచ్చిన భక్తులు

Satyam News

షాబాద్‌లో ఆరు హత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమే

Satyam News

‘లేచింది మహిళాలోకం’ సినిమా ట్రైలర్ లాంచ్

Satyam News

‘పోలీస్ కంప్లైంట్’ కన్నడ టీజర్ విడుదల!

Satyam News

Leave a Comment