26.3 C
Hyderabad
September 19, 2026
హైదరాబాద్హోమ్

నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ కు నివాళి

#Tribute

తెలంగాణలో అనేక నీటిపారుదల ప్రాజెక్టులకు రూపకల్పన చేసి, చారిత్రక భవనాల నిర్మాణానికి మార్గదర్శకత్వం వహించిన అపర భగీరథుడు నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆ మహనీయునికి ఘనంగా నివాళులర్పించారు.

వారి విశిష్ట సేవలను స్మరించుకుంటూ నిర్వహిస్తున్న తెలంగాణ ఇంజనీర్స్ డే సందర్భంగా రాష్ట్రంలోని ఇంజనీర్లందరికీ ముఖ్యమంత్రి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.

“ప్రపంచాన్ని ముందుకు నడిపించే శక్తి ఇంజనీర్ల ఆలోచనల్లో ఉంటుంది. వారి ప్రతిభ, సృజనాత్మకత, కృషి వల్లే అసాధ్యంగా అనిపించిన ఎన్నో కలలు సాకారమవుతున్నాయి. ప్రతి సమస్యను ఒక అవకాశంగా మార్చే దృక్పథం, ప్రతి సవాలుకు వినూత్న పరిష్కారాలను అందించే నైపుణ్యం ఇంజనీర్ల ప్రత్యేకత. ఇంజనీర్ ఆలోచనలో భవిష్యత్తు ఉంటుంది. ప్రతి నిర్మాణంలో సమాజ ప్రగతి ఉంటుంది.” అని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఒక సందేశంలో పేర్కొన్నారు.

Related posts

టీఆర్ఎస్ ఇక కల్వకుంట్ల కవితదే….

Satyam News

ఎర్రకోటపై దాడిలో జైషేమొహ్మద్: యూఎన్ రిపోర్టు

Satyam News

వైకుంఠద్వార దర్శనాలకు విస్తృత ఏర్పాట్లు

Satyam News

కొత్తగా 4 లక్షల ఇళ్లు…. ఏపీలో పేదలకు మరో వరం

Satyam News

తీర్పుల జాప్యం పై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు

Satyam News

మూసీ రివర్ ఫ్రంట్ బాధితులకు ఊరట

Satyam News

Leave a Comment