కరీంనగర్హోమ్

సిరిసిల్ల వడ్ల కొనుగోలు కేంద్రం పరిశీలించిన కేటీఆర్

#ktr

సిరిసిల్ల నియోజకవర్గంలో రైతుల సమస్యలను తెలుసుకునేందుకు ఎమ్మెల్యే కేటీఆర్ విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా వడ్ల కొనుగోలు కేంద్రాలను పరిశీలించి, అక్కడి పరిస్థితులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రైతులు నెల రోజులుగా వడ్లు తీసుకొస్తున్నప్పటికీ ఇప్పటివరకు ఒక్క గింజ కూడా కొనుగోలు చేయలేదని ఆయన ఆరోపించారు. మద్దతు ధరతో పాటు బోనస్ ఇవ్వాల్సి వస్తుందనే ఉద్దేశంతోనే ప్రభుత్వం కొనుగోళ్లు చేపట్టడం లేదని విమర్శించారు.

రైస్ మిల్లులను కేటాయించకపోవడం వల్ల కొనుగోలు ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయిందని, దీనివల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అధికారులను అడిగితే ఇప్పటివరకు 1000 క్వింటాళ్ల వడ్లు కూడా కొనలేదని చెబుతున్నారని ఆయన పేర్కొన్నారు. దళారుల ద్వారా కొనుగోళ్లు జరిపితే కమిషన్లు ఇవ్వాల్సి వస్తుందని భావించి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కొనుగోళ్లు నిలిపివేసిందని ఆరోపించారు. అకాల వర్షాల కారణంగా రైతులు తెచ్చిన ధాన్యం తడిసి పాడైపోతుందనే ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు తమ ఖర్చుతో టార్పాలిన్ కవర్లు కొనుగోలు చేసి వడ్లను కాపాడుకునే పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. రైతు బంధు వంటి పథకాలను కూడా సక్రమంగా అమలు చేయడం లేదని ప్రభుత్వంపై మండిపడ్డారు.

రైతుల ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, లేని పక్షంలో ఉద్యమానికి దిగుతామని హెచ్చరించారు. రాబోయే కాలంలో పరిస్థితులు మారుతాయని, రెండేళ్లలో మళ్లీ తమ ప్రభుత్వం వస్తుందని, అప్పటి నుంచి రైతులను కంటికి రెప్పలా కాపాడుకుంటామని కేటీఆర్ హామీ ఇచ్చారు.

Related posts

ట్రంప్ కు బుద్ధి చెప్పేందుకు భారత్ రెడీ

Satyam News

శ్రీశైలం జలాశయానికి స్వల్పంగా పెరిగిన వరద

Satyam News

భారత సైన్యాధిపతిగా లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్

Satyam News

డ్రగ్స్ రహిత రాష్ట్రం గా ఆంధ్ర ప్రదేశ్

Satyam News

AI ప్రభావం: 20 లక్షల ఉద్యోగాలకు కోత

Satyam News

Amaravati: దేశంలోనే తొలిసారిగా డయాగ్రిడ్ అద్భుతం

Satyam News

Leave a Comment