26.3 C
Hyderabad
September 19, 2026
గుంటూరుహోమ్

హోలీ వేడుకలలో విషాదం: ఈతకు వెళ్లి విద్యార్థి మృతి

పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం బసికాపురంలో హొలీ వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. మంగళవారం ఈతకు వెళ్లిన ఇంటర్ విద్యార్థి గోపి (16) దురదృష్టవశాత్తు కనుమూశాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం హొలీ వేడుకల సందర్భంగా నీటిగుంటలో ఈతకి దిగిన నలుగురు స్నేహితులు నీటి కుంటలో దిగారు.

కాసేపటి తర్వాత ఒడ్డుకు చేరుకున్న ముగ్గురు స్నేహితులు ఒడ్డుకు చేరగా, గోపి కనిపించలేదు. దీంతో స్నేహితులు గ్రామాలలోకి వెళ్లి గ్రామస్తులకు సమాచారం ఇవ్వగా, వారు నీటిగుంటలో ఎనిమిది గంటలు గాలించి గోపిని బయటికి తీశారు. అప్పటికే గోపి మృతి చెందాడని తెలిపారు.

పండుగ రోజు కావడంతో విద్యార్థులు సరదాగా ఈతకు వెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈత సరదా గోపి ప్రాణం తీసిందని కుటుంబ సభ్యులు విలపించారు. విద్యార్థి చనిపోవడంతో గ్రామంలో విషాదం అలుముకుంది.

Related posts

జనసేన బలోపేతంపై పవన్ కల్యాణ్ దృష్టి

Satyam News

జేపీ నడ్డాకు అస్వస్థత: ఎయిమ్స్‌లో చికిత్స

Satyam News

ప్రభుత్వ స్థలం అక్రమిస్తే కఠినమైన చర్యలు

Satyam News

వీరబైరాన్‌పల్లి పోరాట ఘట్టం భావితరాలకు స్ఫూర్తి

Satyam News

అప్పుల ఊబిలో కూరుకుపోయిన కేరళ

Satyam News

మమత పార్టీకి మరో ఎదురుదెబ్బ: ఇక ఖాళీ

Satyam News

Leave a Comment