25.2 C
Hyderabad
September 20, 2026
ఆధ్యాత్మికంహోమ్

వైభవంగా జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

#SrisailamTemple

ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం నుంచే క్షేత్రంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.

ఉదయం 8 గంటలకు చండీశ్వర పూజ, మండపారాధన, కలశార్చన మరియు రుద్ర పారాయణలు శాస్త్రోక్తంగా ప్రారంభం కానున్నాయి. అనంతరం 9 గంటలకు లోక కల్యాణార్థం రుద్ర హోమం, చండీ హోమాలను అర్చకులు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు.సాయంత్రం వేళ ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలు కొనసాగుతాయి.

సాయంత్రం 5:30 గంటలకు సాయంకాల అర్చనలు, రుద్ర పారాయణలు మరియు హోమాలు జరగనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల పర్వదినాన విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం తరఫున అధికారులు శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు సాయంత్రం 6 గంటలకు పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు.

అనంతరం రాత్రి 7 గంటలకు భక్తుల జయజయధ్వానాల మధ్య శ్రీ స్వామి అమ్మవార్లు హంస వాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు.

Related posts

ఫైనల్ కు దూసుకు వెళ్లిన టీమిండియా

Satyam News

నిన్న కమ్మ ద్వేషం… నేడు.. కాపులతో పాలిటిక్స్..

Satyam News

వాకర్స్ అసోసియేషన్ మెగా వైద్య శిబిరం

Satyam News

బీజేపీ ప్రభుత్వానికి మమత తాజా హెచ్చరిక

Satyam News

అంతర్జాతీయ పెట్టుబడులను భారీగా ఆకర్షించేలా ప్రణాళిక

Satyam News

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ రెడీ… ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు

Satyam News

Leave a Comment