ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం నుంచే క్షేత్రంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.
ఉదయం 8 గంటలకు చండీశ్వర పూజ, మండపారాధన, కలశార్చన మరియు రుద్ర పారాయణలు శాస్త్రోక్తంగా ప్రారంభం కానున్నాయి. అనంతరం 9 గంటలకు లోక కల్యాణార్థం రుద్ర హోమం, చండీ హోమాలను అర్చకులు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు.సాయంత్రం వేళ ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలు కొనసాగుతాయి.
సాయంత్రం 5:30 గంటలకు సాయంకాల అర్చనలు, రుద్ర పారాయణలు మరియు హోమాలు జరగనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల పర్వదినాన విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం తరఫున అధికారులు శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు సాయంత్రం 6 గంటలకు పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు.
అనంతరం రాత్రి 7 గంటలకు భక్తుల జయజయధ్వానాల మధ్య శ్రీ స్వామి అమ్మవార్లు హంస వాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు.
