స్వదేశ్ దర్శిని 2.0 తో భాగంగా బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్ లో పంచాయతీ రాజ్ ద్వారా నిర్మాణం చేపట్టే ప్రహరీ గోడ నిర్మాణ పనులకు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ శంఖుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్, జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్, బాపట్ల నియోజకవర్గం ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు, రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ బాలాజీ,
జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా ఆర్డీఓ పి. గ్లోరియా, జిల్లా టూరిజం అధికారి అనందపాల్, డీ ఎఫ్ ఓ. రవి శంకర్, డీ పి ఓ. యల్. ప్రభాకర్ రావు, పర్యాటక శాఖ, డీ ఈ,జిల్లా భూ రికార్డ్స్ అధికారి సాంబశివరావు, జలవనరుల శాఖ ఎస్ ఈ. గోపి నాధ్,డీ యం & హెచ్ ఓ. డాక్టర్ ఎస్. విజయమ్మ,
పర్యాటక శాఖ మేనేజర్ రమేష్, పంచాయతీ రాజ్, రాజన్ బాబు, జిల్లా గ్రామీణ నీటి సరఫరా శాఖ, ఎస్ ఈ అనంత రాజు, మున్సిపల్ కమిషనర్ జిల్లా. జి. రఘునా ద్ రెడ్డి, తహసీల్దార్ షేక్ సలీమా, యం పి డీ ఓ. బాబురావ్ తదితరులు కూడా పాల్గొన్నారు.
