26.7 C
Hyderabad
September 20, 2026
మహబూబ్ నగర్హోమ్

దీపావళి ప్రజలందరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలి

జిల్లా ప్రజల జీవితాల్లో దీపావళి పండగ కోటికాంతులు నింపాలని నాగర్​కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్​ సంతోష్​ అన్నారు. దీపావళి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా ప్రజలకు కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ బాదావత్​ సంతోష్​ మాట్లాడుతూ… చీకటి నుంచి వెలుగులోకి… చెడుపైన మంచి… దుష్టశక్తులపైన దైవశక్తి సాధించిన విజయానికి దీపావళి ప్రతీక అని ఈ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ పండగను ఆనందోత్సాహాలతో కుటుంబసభ్యుల మధ్య జరుపుకోవాలని కోరారు.

పండగ సందర్భంగా బాణాసంచా కాల్చే సమయంలో అవసరమైన జాగ్రత్తలు పాటిస్తూ దీపావళి పండగను ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఆనందంగా జరుపుకోవాలని తెలిపారు. నాగర్​ కర్నూల్​ జిల్లా ప్రజలందరికీ, ప్రజాప్రతినిధులు, అధికారులు అందరికీ సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు కలిగి ప్రతి ఇంటా కోటి ఆనంద దీపాలు వెలగాలని కలెక్టర్ బాదావత్​ సంతోష్​ ఆకాంక్షించారు.

Related posts

అంతర్జాతీయ పెట్టుబడులను భారీగా ఆకర్షించేలా ప్రణాళిక

Satyam News

పీవీ సునీల్ ధిక్కారం !

Satyam News

ప్రెస్ క్లబ్ సభ్యులకు నిమ్స్ లో మాస్టర్ హెల్త్ చెకప్

Satyam News

ట్రంప్ మూర్ఖత్వం వల్ల ఎంత నష్టం? ఎంత కష్టం?

Satyam News

ప్రంబనన్ ఆలయాన్ని సందర్శించిన ప్రధాని మోడీ

Satyam News

భక్తుల కోలాహలం మధ్య చార్ ధాం యాత్ర ప్రారంభం

Satyam News

Leave a Comment