ప్రపంచంహోమ్

ప్రంబనన్ ఆలయాన్ని సందర్శించిన ప్రధాని మోడీ

#PrambananTemple

తొమ్మిదో శతాబ్దానికి చెందిన ప్రంబనన్ ఆలయంను భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇండోనేషియా పర్యటనలో భాగంగా బుధవారం సందర్శించారు.

ఈ పర్యటనతో పాటు గత దశాబ్ద కాలంగా ఆసియా దేశాల్లో ఉమ్మడి నాగరికత, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించే ప్రాచీన దేవాలయాలు, చారిత్రక కట్టడాల పునరుద్ధరణ కోసం భారత్ చేపడుతున్న కార్యక్రమాలు మరోసారి ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఆధునిక రాజకీయ సరిహద్దులకు ముందే ఏర్పడిన సాంస్కృతిక బంధాలను మరింత బలోపేతం చేయడమే ఈ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశ్యంగా భావిస్తున్నారు.

2014లో భారత్, వియత్నాం మధ్య అవగాహన ఒప్పందం కుదిరిన తర్వాత మై సన్ అభయారణ్యం పునరుద్ధరణ పనులు ప్రారంభమయ్యాయి. యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో ఉన్న ఈ శైవ ఆలయ సముదాయం ఒకప్పుడు చంపా రాజ్యానికి ప్రధాన ఆధ్యాత్మిక కేంద్రంగా ఉండేది. ఆగ్నేయాసియాలోని అత్యంత ముఖ్యమైన హిందూ వారసత్వ కట్టడాల్లో ఇది ఒకటిగా గుర్తింపు పొందింది.

2015లో శ్రీలంకలోని చారిత్రక తిరుకేతీశ్వరమ్ ఆలయం పునరుద్ధరణ కోసం భారత్ 326 మిలియన్ శ్రీలంక రూపాయల గ్రాంట్ సహాయాన్ని ప్రకటించింది. భగవాన్ శివునికి అంకితమైన ద్వీప దేశంలోని ఐదు ప్రాచీన పంచ ఈశ్వరాలయాల్లో ఇది ఒకటి.

2017లో మయన్మార్లో సంభవించిన భూకంపం అనంతరం బగాన్ పురావస్తు ప్రాంతంలోని చారిత్రక కట్టడాల పునరుద్ధరణకు భారత్ ముందుకొచ్చింది. ఈ ప్రాజెక్టులో 12 ప్రాచీన పగోడాల సంరక్షణతో పాటు ప్రసిద్ధ ఆనంద ఆలయం పునరుద్ధరణ కూడా చేపట్టింది.

అదే సంవత్సరంలో నేపాల్లో భూకంపం అనంతర పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగంగా 50 మిలియన్ డాలర్ల సహాయంతో 28 చారిత్రక వారసత్వ కట్టడాల పునరుద్ధరణ ప్రారంభించింది. ఇందులో సేతో మచ్చింద్రనాథ్ ఆలయం, బుధనీలకంఠ ఆలయ ధర్మశాల వంటి ప్రముఖ కట్టడాలు ఉన్నాయి.

బంగ్లాదేశ్లో 1971లో జరిగిన సైనిక చర్యల సమయంలో ధ్వంసమైన రమ్నా కాళీ ఆలయం పునర్నిర్మాణానికి భారత్ ఆర్థిక సహాయం అందించింది. ఈ ఆలయాన్ని 2021లో తిరిగి ప్రారంభించారు. అదేవిధంగా దాదాపు 300 ఏళ్ల చరిత్ర కలిగిన జయ్ కాళీ మాత ఆలయం, ఆనందమయీ కాళీ మాత మందిరం, రామకృష్ణ ఆలయాల పునరుద్ధరణకు కూడా భారత్ సహకారం అందించింది.

ఆలయాల పునరుద్ధరణకు భారత్ సాయం

కంబోడియాలోని అంకోర్ వారసత్వ సముదాయంలో తా ప్రోమ్ ఆలయం, అంకోర్ వాట్లోని కొన్ని భాగాలు, అలాగే ప్రెహ్ విహియర్ దేవాలయం పునరుద్ధరణ పనులను కూడా భారత్ చేపట్టింది.

లావోస్లోని దాదాపు వెయ్యేళ్ల చరిత్ర కలిగిన వాట్ ఫౌ ఆలయంలో కీలక నిర్మాణాలను భారత్ పునరుద్ధరించింది. ఇది ఆగ్నేయాసియాలో సనాతన నాగరికతకు నిలువెత్తు చిహ్నంగా భావించబడుతోంది.

2019లో నరేంద్ర మోదీ బహ్రెయిన్ పర్యటన సందర్భంగా రాజధాని మనామాలోని 200 ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీనాథ్‌జీ ఆలయం పునరాభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించారు. గల్ఫ్ ప్రాంతంలోని అత్యంత ప్రాచీన హిందూ ఆలయాల్లో ఒకటైన ఈ ఆలయం సంరక్షణకు భారత్ విశేష సహకారం అందించింది.

ఈ నేపథ్యంలో ఇండోనేషియాలోని అతిపెద్ద హిందూ దేవాలయ సముదాయమైన ప్రంబనన్ ఆలయాన్ని ప్రధాని మోదీ సందర్శించడం, ఆగ్నేయాసియా దేశాలతో భారత సాంస్కృతిక దౌత్యానికి మరో కీలక ఘట్టంగా విశ్లేషకులు భావిస్తున్నారు. శివుడికి అంకితమైన ఈ ఆలయం భారత్-ఇండోనేషియా మధ్య వేల ఏళ్ల సాంస్కృతిక అనుబంధానికి ప్రతీకగా నిలుస్తోంది.

Related posts

ఇండక్షన్ స్టౌ లకు పెరిగిన డిమాండ్

Satyam News

జగన్‌-భారతి స్కెచ్‌కు విజయమ్మ బ్రేకులు..ఆస్తి వివాదంలో ట్విస్ట్‌!

Satyam News

ఆశ్రమంలో అపర వాల్మీకి జయంతి వేడుకలు

Satyam News

దేశంలోనే మొదటి డిజిటల్‌.. ఏఐ ప్లస్ క్యాంపస్..

Satyam News

అమరావతిలో ధోనీ క్రికెట్ అకాడెమీ ప్లస్ ట్రైనింగ్ సెంటర్..??

Satyam News

నందిగామలో జంట నాగేంద్రుల దివ్య విగ్రహం

Satyam News

Leave a Comment