అనుమానం పెనుభూతం అయింది. నిండు గర్భిణి అని కూడా చూడకుండా ఒక భర్త తన భార్యను దారుణంగా హతమార్చాడు.
కడపజిల్లా నందలూరు మండలం టంగుటూరులో ఈ దారుణం జరిగింది. సిద్దవటం లక్షుమమ్మ (28) అనే మహిళను ఆమె భర్తే హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.
భార్యపై అనుమానంతోనే హతమార్చాడని పోలీసులు తెలిపారు.
అత్యంత విషాదకరమైన విషయం ఏమిటంటే మృతురాలు నాలుగు నెలల గర్భిణి…… భార్యను హత్య చేసి తోటలో పడేసిన భర్త నరసయ్యను పోలీసులు అదపులోకి తీసుకున్నారు.
తదుపరి వివరాల కోసం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.