మెదక్హోమ్

సంగారెడ్డి లో దొడ్డి కొమురయ్య జయంతి ఉత్సవాలు

#DoddiKomaraiah

రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సంగారెడ్డి జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు శ్రీ దొడ్డి కొమురయ్య 99 వ జయంతి సందర్భంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఉన్న వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారి అందించిన స్ఫూర్తిని స్మరించుకున్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సబ్బండ వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు.  ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు చింత ప్రభాకర్, జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య, సంగారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ కూన వనిత సంతోష్ , జిల్లా గ్రంధాలయ సంస్థ అధ్యక్షులు అంజయ్య, RC పురం  కార్పొరేటర్ పుష్ప నగేష్, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి జగదీష్, జిల్లా గొల్ల కురుమ అసోసియేషన్ అధ్యక్షులు మల్లయ్య యాదవ్, అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు, ప్రజాసంఘాల నాయకులు, జిల్లా నాయకులు పాల్గొన్నారు.

Related posts

యువ అడ్వకేట్ ను జైల్లో వేయించిన ఏపి హైకోర్టు న్యాయమూర్తి

Satyam News

సైఫన్ గేట్లు తెరుచుకున్న సరళాసాగర్

Satyam News

సుప్రీంకోర్టు వ్యాఖ్యల్ని తప్పుగా ప్రచారం చేస్తున్న వైసీపీ

Satyam News

తిరుమల పరకామణి చోరీలో సంచలన విషయాలు….

Satyam News

యుద్ధంపై ట్రంప్ ప్రకటనతో పడిపోయిన చమురు ధరలు

Satyam News

వీధి కుక్కలపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

Satyam News

Leave a Comment