బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్’ సీక్వెల్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు మేకర్స్ తీపి కబురు అందించారు.
ఈ సినిమా రెండవ భాగం ‘ధురంధర్: ది రివెంజ్’ ప్రపంచవ్యాప్తంగా 2026, మార్చి 19న విడుదల కానుంది.తొలి భాగం కేవలం హిందీలో విడుదలై భారత్లో 1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి లభించిన అఖండ స్పందనను దృష్టిలో ఉంచుకుని, రెండవ భాగాన్ని హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళం మరియు కన్నడ భాషల్లో ఏకకాలంలో విడుదల చేయాలని నిర్మాతలు నిర్ణయించారు.
ఇటీవలే విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచింది. మొదటి భాగం ముగింపులో కనిపించిన కీలక సన్నివేశాలకు కొనసాగింపుగా సెకండ్ పార్ట్ ఉండబోతోంది. పాకిస్థాన్లో భారత గూఢచారిగా హమ్జా (రణ్వీర్ సింగ్) చేసే పోరాటం, అక్కడి ఉగ్రవాద మూలాలను ఎలా అంతం చేస్తారనేది ఈ సీక్వెల్లో ప్రధానంగా చూపించనున్నారు.
పాకిస్థాన్ పై ఇటీవల జరిపిన ఆపరేషన్ సిందూర్ వివరాలు పొందుపరచినట్లు చెబుతున్నారు.ఆదిత్య ధర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రణ్వీర్ సింగ్తో పాటు సంజయ్ దత్, ఆర్. మాధవన్, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్ వంటి దిగ్గజ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా నాన్-థియేట్రికల్ హక్కులు (డిజిటల్ మరియు శాటిలైట్) భారీ ధరకు అమ్ముడై సరికొత్త రికార్డులను సృష్టించాయి. మార్చి 19న ఉగాది పర్వదినం సందర్భంగా ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది.
