26.3 C
Hyderabad
September 19, 2026
ముఖ్యంశాలుహోమ్

మాచర్ల లో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురు మృతి

మాచర్ల శివారు నగర వనం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని తుఫాను వాహనం ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. హైదరాబాదు నుండి కనిగిరి సమీపంలోని వెనిగండ్ల మండలం నాగిరెడ్డి పల్లె గ్రామానికి వెళుతుండగా తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది.

వీరంతా వారి మృతి చెందిన బంధువు అంత్యక్రియలకు హాజరవుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ వాహనంలో డ్రైవర్ తో సహా మొత్తం 13 మంది ప్రయాణిస్తున్నారు. ఇద్దరు మహిళలు ఇద్దరు మగవారు మృతి చెందారు. ముగ్గురు చిన్నారులు గాయ పడ్డారు. వారి మెరుగైన వైద్యం కోసం నరసరావుపేట తరలించారు. మృతి చెందిన వారి వివరాలు: కదిరి వెంకటేశ్వర్లు, కదిరి శారద, పిడుగు సత్యనారాయణ, పిడుగు శారద.

మాచర్ల పట్టణం నుండి మండాది రోడ్డులో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రమాద స్థలంలో మృతి చెందారు మిగిలిన వారిని108 వాహనం ద్వారా మాచర్ల ప్రభుత్వాసుపత్రికి తరలించడం జరిగింది. ప్రధమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నరసరావుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు వైద్యులు వెల్లడించారు.

Related posts

భారత్-చైనా మధ్య విమాన సర్వీసులు పునఃప్రారంభం

Satyam News

ఎగువన భారీ వర్షాలు కురిస్తేనే జూరాల, శ్రీశైలం, సాగర్‌ కు నీళ్లు

Satyam News

విద్యా రంగంలో భారీ పెట్టుబడులకు సాయం చేయండి

Satyam News

బెంగళూరు కేంద్రంగా ‘కుట్రల’ ఆపరేషన్

Satyam News

శిక్షణలో ఉన్న పిల్లల పురోగతిపై ఛార్ట్ లు రూపొందించండి

Satyam News

చదువులో రాణించలేని విద్యార్థులు క్రీడల్లో పోటీ పడాలి

Satyam News

Leave a Comment