ముఖ్యంశాలుహోమ్

మాచర్ల లో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురు మృతి

మాచర్ల శివారు నగర వనం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని తుఫాను వాహనం ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. హైదరాబాదు నుండి కనిగిరి సమీపంలోని వెనిగండ్ల మండలం నాగిరెడ్డి పల్లె గ్రామానికి వెళుతుండగా తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది.

వీరంతా వారి మృతి చెందిన బంధువు అంత్యక్రియలకు హాజరవుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ వాహనంలో డ్రైవర్ తో సహా మొత్తం 13 మంది ప్రయాణిస్తున్నారు. ఇద్దరు మహిళలు ఇద్దరు మగవారు మృతి చెందారు. ముగ్గురు చిన్నారులు గాయ పడ్డారు. వారి మెరుగైన వైద్యం కోసం నరసరావుపేట తరలించారు. మృతి చెందిన వారి వివరాలు: కదిరి వెంకటేశ్వర్లు, కదిరి శారద, పిడుగు సత్యనారాయణ, పిడుగు శారద.

మాచర్ల పట్టణం నుండి మండాది రోడ్డులో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రమాద స్థలంలో మృతి చెందారు మిగిలిన వారిని108 వాహనం ద్వారా మాచర్ల ప్రభుత్వాసుపత్రికి తరలించడం జరిగింది. ప్రధమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నరసరావుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు వైద్యులు వెల్లడించారు.

Related posts

రాసలీలల డీజీపీపై వేటు వేసిన ప్రభుత్వం

Satyam News

త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న అనుష్క

Satyam News

ఉడుపి శ్రీకృష్ణ మఠాన్ని సందర్శించిన పవన్ కళ్యాణ్

Satyam News

ఐఆర్జీసీ పై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్

Satyam News

తప్పుడు ప్రచారం కేసులో జగన్ సి పి ఆర్ ఓ అరెస్టు

Satyam News

ఆ పార్టీల పొత్తు కోసం జగన్‌ ఆరాటం…

Satyam News

Leave a Comment