కృష్ణహోమ్

చంద్రబాబుతో గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ చైర్మన్ భేటీ

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ చైర్మన్ పి దోర్జే గ్యాంబా సీఎం క్యాంపు కార్యాలయంలో ఆదివారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో చేపట్టిన జల సంరక్షణ, సమర్ధ నీటి నిర్వహణ చర్యలు గురించి దోర్జే గ్యాంబాకు ముఖ్యమంత్రి వివరించారు.

రాష్ట్రంలోని నదీపరివాహక ప్రాంతాల్లో అవేర్ సంస్థ ద్వారా జల వనరుల వివరాలు రియల్ టైమ్‌లో నమోదు చేస్తున్నట్టు తెలిపారు. వరద జలాలను సద్వినియోగం చేసుకుంటున్న తీరును, నదుల అనుసంధానంపై రూపొందించిన ప్రణాళికల గురించి వెల్లడించారు. అలాగే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దు.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పెద్దవాగు ప్రాజెక్టు సమస్యపై చర్చించారు.

గత సీజన్లో పెద్దవాగు పొంగి కట్ట తెగడంతో రెండు రాష్ట్రాల్లోనూ వరదలు సంభవించాయని, ఈ కారణంగా ప్రజలు ఇబ్బంది పడిన విషయం ఈ సమావేశంలో చర్చకు వచ్చింది. పెద్దవాగు ప్రాజెక్టు కట్టను బలోపేతం చేయడానికి తెలంగాణ రాష్ట్రంతో కలిసి పనిచేయడానికి తాము సిద్ధంగా ఉన్నట్టు దోర్జే గ్యాంబాకు సీఎం తెలిపారు.

Related posts

సోషల్ మీడియాలో తోక ముడిచిన అబద్ధాల ముఠా

Satyam News

ముచ్చింతల్‌లో సమతా మూర్తిని దర్శించుకున్న సుమ

Satyam News

ప్రపంచ రేడియో దినోత్సవం సందర్భంగా ప్రధాని ఏమన్నారంటే

Satyam News

జర్నలిజాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది

Satyam News

జోధ్‌పూర్‌లో ఐసిస్ హ్యాండ్లర్ అరెస్ట్: ఏపీ పోలీసుల ఆపరేషన్

Satyam News

ఈ-ఫైళ్ల క్లియరెన్స్‌లో మంత్రి అచ్చెన్నాయుడు సరికొత్త రికార్డు

Satyam News

Leave a Comment