హైదరాబాద్హోమ్

పెన్షన్ బెనిఫిట్స్ కోసం లంచం: ఇద్దరి పట్టివేత

హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, పే-బిల్ సెక్షన్‌లో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న కె. రమేష్ (48), ఫిర్యాదుదారుడి నుండి రూ. 13,000 లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు, అతడిని పట్టుకున్నారు. తనతో పాటు అదే సెక్షన్‌లో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న అరవింద్ తరపున కూడా ఈ మొత్తాన్ని వసూలు చేసిన రమేష్, ఫిర్యాదుదారుని తల్లికి సంబంధించిన పెన్షన్ బెనిఫిట్ ఫైల్‌ను ఇప్పటికే ప్రాసెస్ చేసి ఉన్నతాధికారులకు పంపినందుకు ప్రతిఫలంగా మరియు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఫైల్‌ను తదుపరి చర్యల కోసం ముందుకు పంపేందుకు (అధికారిక మేలు చేసేందుకు) గాను ఈ లంచాన్ని అక్రమ ప్రయోజనం కింద స్వీకరించాడు.

ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ అవినీతినిరోధకశాఖ వారి “టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి”. అంతే కాకుండా వివిధ సామాజిక మాధ్యమాలయిన “వాట్సాప్ (9440446106), ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ (acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ అనిశా ను సంప్రదించవచ్చును.

Related posts

డిసెంబర్ 6న ఆశ్రా జాతీయ సదస్సు

Satyam News

అంబులెన్స్ లో మంటలు: నవజాత శిశువు సజీవ దహనం

Satyam News

పాషాణాలను సైతం కరిగించిన కథ!

Satyam News

రెవెన్యూ లోటు తగ్గించడం గొప్ప విషయం

Satyam News

బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య..!

Satyam News

గల్ఫ్ దేశాల డేటా సెంటర్లను టార్గెట్ చేసిన ఇరాన్?

Satyam News

Leave a Comment