విశాఖపట్నం లో ఈరోజు సాయంత్రం 5.00 గంటలకు విశాఖపట్నంలోని ది పార్క్ హోటల్ (బీచ్ రోడ్) నుండి కాళీ మాత ఆలయం వరకు హనుమాన్ విజయోత్సవ కమిటీ ఆధ్వర్యంలో, భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు ఎం ఎం ఎన్ పరశురామరాజు నాయకత్వంలో ఘనంగా హనుమాన్ విజయోత్సవ శోభాయాత్ర నిర్వహించబడింది.
ఈ కార్యక్రమం రాజకీయ పార్టీలకు అతీతంగా భక్తి, ఐక్యతకు ప్రతీకగా సాగింది. ఈ శోభాయాత్రలో మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు , విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు ఎం భరత్, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ , అలాగే విశాఖపట్నం జిల్లాలోని వివిధ నియోజకవర్గాల శాసనసభ్యులు పాల్గొన్నారు. వేలాదిగా హిందూ భక్తులు ఉత్సాహంగా పాల్గొని భజనలు, నినాదాలతో శోభాయాత్రను విజయవంతం చేశారు. నగరంలో భక్తి వాతావరణం నెలకొంది.
