విజయనగరంహోమ్

జై అమరావతి అంటూ విజయనగరంలో భారీ ర్యాలీ

#Vijayanagaram

లోక్ సభలో అమరావతి ని శాశ్వత రాజధాని గా చేస్తూ కేంద్రం బిల్లు పాస్ అవడంతో విజయనగరంలో విజయోత్సవ ర్యాలీ గురువారం జరిగింది. కూటమి ఎమ్మెల్యే ఆదితీ నేతృత్వంలో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు ఆకుపచ్చ రంగులు జెండాలు మెడలో వేసుకుని త్రివర్ణ పతాకాన్ని చేత్తో పట్టుకుని నగరంలోని అశోక్ బంగ్లా నుంచే ఆంబేద్కర్ జంక్షన్ వరకు ర్యాలీ కొనసాగించారు.

విద్యుత్ దీప కాంతుల్లో విజయనగరం కలెక్టరేట్

రాష్ట్ర రాజధానిగా అమరావతిని శాశ్వతం చేస్తూ పార్లమెంట్ చారిత్రాత్మక బిల్లు ఆమోదం పొందడంతో జిల్లా కలెక్టరేట్ విద్యుత్ దీపాలతో అలంకరణ చేశారు. అమరావతి ని ఏపీ రాష్ట్ర రాజధానిగ కేంద్రం ఆమోదించిన నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని అంటాయి. పలు  ప్రాంతాలలో ప్రజలు కేకులు కట్ చేయడం రంగోలి ముగ్గులు ర్యాలీలు కార్యాలయాలకు లైటింగ్ తదితర కార్యక్రమాలతో వారి సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు.  అందులో భాగంగా కలెక్టర్ ఆఫీస్ ను రంగురంగుల లైట్లతో అలంకరించారు.

Related posts

చీటీల పేరుతో ఘరానా మోసం…!

Satyam News

క్యాన్సర్ తో బాధపడుతున్న బాలలకు చిత్రలేఖనం పోటీలు

Satyam News

పోలీసులకు చిక్కిన అంతర్ రాష్ట్ర ముఠా

Satyam News

రెండో రోజు కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె

Satyam News

రెండు పెళ్లిళ్లు..సహజీవనం..అక్రమ సంబంధం..చివరకు మర్డర్

Satyam News

మరో వ్యక్తిపై ఉపా చట్టం కింద కేసు నమోదు

Satyam News

Leave a Comment