పోలవరం ప్రాజెక్ట్ పనుల పరిశీలనలో భాగంగా పోలవరం చేరుకున్న రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ ముందుగా ప్రాజెక్ట్ వ్యూ పాయింట్ నుండి ప్రాజెక్ట్ పనుల పురోగతిని పరిశీలించారు. రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రి డా. నిమ్మల రామానాయుడు, పోలవరం ప్రాజెక్ట్ ఇంజనీర్ ఇన్ చీఫ్ కె.నరసింహ మూర్తి లు ప్రాజెక్ట్ పనుల పురోగతిని గవర్నర్ కు వివరించారు. అంతకుముందు ప్రాజెక్ట్ పనులను హెలికాప్టర్ నుండి ఏరియల్ వ్యూ ద్వారా గవర్నర్ పరిశీలించారు.
ఎమ్మెల్యేలు చిర్రి బాలరాజు, బలరామకృష్ణ ప్రసాద్, జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, పోలవరం ప్రాజెక్టు అడ్మిని స్ట్రేటరు అభిషేక్, జిల్లా జాయింటు కలెక్టరు డా.యం.జె. అభిషేక్ గౌడ, ఎస్ఈ ఆర్. రామచంద్రరావు, జిల్లా అటవీశాఖ అధికారి పి.వి.సంధీప్ రెడ్డి, ఐటిడిఏ పీవో కె.రాములు నాయక్, మెగా సిఓఓ ఏ .వి.సతీష్, జీఎం. గంగాధర్, ఇంజనీరింగు ప్రతినిధులు, తదితర ప్రభృతులు ఉన్నారు.
