హైదరాబాద్హోమ్

మంత్రి కొండా సురేఖను కలిసిన శైలజా రామయ్యర్

#KondaSurekha

పర్యావరణ, అటవీశాఖల ప్రిన్సిపల్ సెక్రటరీగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన శైలజా రామయ్యర్  అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ ని జూబ్లిహిల్స్ లోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ శైలజా రామయ్యర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

శైలజా రామయ్యర్ నేతృత్వంలో అటవీ,పర్యావరణ శాఖలు మరింత ప్రభావవంతంగా పనిచేసి, ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. సీఎం రేవంత్ రెడ్డి గారి ఆశయాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ, వన మహోత్సవం, వన్యప్రాణులు, జీవవైవిధ్య పరిరక్షణ, అడవుల్లో అగ్నిప్రమాదాల నివారణ, అడవుల సంరక్షణలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన వినియోగం తదితర కార్యక్రమాలను సమర్థవంతంగా చేపట్టేలా కార్యాచరణను అమలు చేయాలని మంత్రి సురేఖ శైలజా రామయ్యర్ కు దిశానిర్దేశం చేశారు.

అటవీ, పర్యావరణ శాఖల బలోపేతం దిశగా ప్రణాళికాబద్దంగా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఈ సందర్భంగా అటవీ, పర్యావరణ శాఖలకు సంబంధించిన పలు అంశాల పై మంత్రి కొండా సురేఖ,  ముఖ్య కార్యదర్శి శైలజా రామయర్య మధ్య సంక్షిప్తంగా చర్చ జరిగింది.

Related posts

ఏపీకి 30 వేల కోట్ల కేంద్ర గ్రాంట్‌…. ఐదేళ్లలో అదనంగా 80 వేల కోట్లు

Satyam News

లీక్ వీరులకు షాక్: పేపర్ లీక్ చేస్తే 10 ఏళ్లు జైలు

Satyam News

యోగాతో శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతత

Satyam News

ఓపెన్‌ఏఐ భారత్‌లో తొలి కార్యాలయం ఏర్పాటు

Satyam News

సాఫ్ట్ వేర్ ఉద్యోగుల్లో పెరుగుతున్న సుఖ వ్యాధులు

Satyam News

సోషల్ మీడియా నియంత్రణ సాధ్యమేనా?

Satyam News

Leave a Comment