ప్రత్యేకంహోమ్

బెంగాల్ విజయం చిరస్మరణీయం

#Modi

పశ్చిమ బెంగాల్ లో చిరస్మరణీయ విజయం సాధించామని ప్రధాని నరేంద్రమోడీ తెలిపారు. మంచి పాలన అందించాలన్న బీజేపీ అభిమతమే అంతిమంగా పైచేయి సాధించిందని చెప్పారు. పశ్చిమ బెంగాల్‌ ప్రజలు బీజేపీకి అద్భుతమైన విజయాన్ని అందించారని ప్రధాని మోదీ అన్నారు.

ఈ విజయం కోసం రాష్ట్రంలో పార్టీకి చెందిన కొన్ని తరాల కార్యకర్తలు నిరంతరం శ్రమించారని ప్రశంసించారు. కొన్నేళ్ల పాటు క్లిష్ట పరిస్థితుల్లో పోరాడారని అన్నారు. కార్యకర్తలే పార్టీ శక్తి అని కొనియాడారు. ప్రతి ఒక్క కార్యకర్తకూ తాను సెల్యూట్ చేస్తున్నానని అన్నారు.

రాష్ట్ర ప్రజల ఆశలను, కలలను సాకారం చేసేందుకు బీజేపీ శక్తివంచన లేకుండా కృషి చేస్తుందని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలకూ అవకాశాలు, గౌరవం దక్కేలా పాలన అందిస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు.

Related posts

ఫార్వర్డ్ ప్లేయర్ నవనీత్ కౌర్ ప్రతిష్టాత్మక అవార్డు

Satyam News

శేషాచలం అడవుల్లో అగ్ని ప్రమాదంపై సమీక్ష

Satyam News

మూడు ముక్కలైన కేసీఆర్ పార్టీ

Satyam News

ఇందిరమ్మ ఇళ్లకు స్టీల్, సిమెంట్ ధ‌ర‌లు త‌గ్గించాలి

Satyam News

ఎంఎల్ పార్టీల సాయుధ పోరాట విరమణ

Satyam News

వనపర్తి చైర్మన్ పదవి బీసీలకు ఇవ్వాలి: సతీష్

Satyam News

Leave a Comment