టొరాంటోలో 30 ఏళ్ల భారతీయ మహిళ హత్యకు గురైన ఘటన కలకలం రేపింది. ఈ కేసులో ప్రథమ శ్రేణి హత్య ఆరోపణలపై అనుమానితుడి కోసం పోలీసులు దర్యాప్తు చేపట్టారు అని టొరాంటో పోలీస్ విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. మృతురాలిని హిమాంశి ఖురానాగా గుర్తించారు. స్ట్రాచన్ అవెన్యూ, వెల్లింగ్టన్ స్ట్రీట్ వెస్ట్ ప్రాంతంలో ఆమె కనిపించట్లేదని ఫిర్యాదు నమోదైన మరుసటి రోజు, శనివారం ఒక నివాసంలో ఆమె మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు అని కెనడియన్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ నివేదించింది.
ఈ కేసులో 32 ఏళ్ల అబ్దుల్ ఘఫూరీపై ప్రథమ శ్రేణి హత్యకు సంబంధించి అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. ఘఫూరీ కూడా టొరాంటో నివాసితుడే. ఈ ఘటనపై టొరాంటోలోని భారత హై కమిషన్ తీవ్ర దిగ్భ్రాంతి మరియు విచారం వ్యక్తం చేసింది. ఇది అత్యంత విషాదకరమైన ఘటనగా పేర్కొంటూ, హిమాంశి ఖురానా హత్య పట్ల తీవ్ర సంతాపం తెలియజేసింది. మృతురాలి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసిన హై కమిషన్, గత కొన్ని రోజులుగా ఈ విషయాన్ని సమీపంగా పర్యవేక్షిస్తున్నామని, దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో కుటుంబానికి పూర్తి సహకారం అందిస్తామని తెలిపింది.
