ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) నూతన డైరెక్టర్ గా సీనియర్ ఐపీఎస్ అధికారి మహేష్ దీక్షిత్ ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. 1993 బ్యాచ్కు చెందిన తెలంగాణ కేడర్ ఐపీఎస్ అధికారి అయిన మహేష్ దీక్షిత్కు అంతర్గత భద్రత, ఉగ్రవాద నిరోధక కార్యకలాపాల్లో విస్తృత అనుభవం ఉంది. ఆయన గతంలో జమ్మూ కాశ్మీర్లో ఇంటెలిజెన్స్ బ్యూరో జాయింట్ డైరెక్టర్గా పనిచేసి, భద్రతా వ్యవహారాల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు.
భారత అంతర్గత నిఘా వ్యవస్థను పర్యవేక్షించే అత్యున్నత పదవిగా భావించే ఐబీ డైరెక్టర్ హోదాలో మహేష్ దీక్షిత్ దేశ భద్రత, అంతర్గత నిఘా సమన్వయం, ఉగ్రవాద వ్యతిరేక చర్యలు, గూఢచారి సమాచార సేకరణ వంటి కీలక బాధ్యతలను నిర్వహించనున్నారు.
