ఖమ్మంహోమ్

మావోయిస్టుల ఫేక్‌ ఎన్‌కౌంటర్స్‌ విచారకరం

#KunamaneniSambasivarao

మావోయిస్టులను చంపుకుంటూ పోవడమంటే మానవ హననం తప్ప మరొకటి కాదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు  జంగిల్‌ రాజ్‌ పరిపాలనకు పరాకాష్ట అని వారన్నారు. 

ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల పోలీసులు కూడా  ఇందులో పావులుగా మారారని ఆయన పేర్కొన్నారు.  ఈ రోజు మాడేరుమిల్లులో జరిగిన హిడ్మా ఎన్‌కౌంటర్‌, అందకంటే ముందు మావోయిస్టులపై జరిగిన ఎన్‌కౌంటర్స్‌ మొత్తం ఫేక్‌ ఎన్‌కౌంటర్స్‌ అని కూనంనేని తెలిపారు. బూటకపు ఎన్‌ కౌంటర్స్‌తో మనుషులను చంపుకునే వ్యవస్థ ప్రపంచంలో ఎక్కడా లేదని, మావోయిస్టులు ఏదైన నేరాలు చేసివుంటే వారిని అరెస్టు చేసి చట్టభద్దంగా విచారణ జరిపించాలని ఇలాంటి ఫేక్‌ ఎన్‌కౌంటర్‌లు చేయడం విచారణకరమని అన్నారు.

మావోయిస్టులపై జరుగుతున్న ఎన్‌కౌంటర్లపై విచారణ జరిపించాలని కూనంనేని సాంబశివరావు డిమాండ్‌ చేశారు.

Related posts

త్వరలో మేడిన్‌ ఆంధ్రా షిప్స్…. ఏపీలో షిప్‌ బిల్డింగ్‌ క్లస్టర్‌

Satyam News

బాల‌ల హ‌క్కుల ప‌రిర‌క్ష‌ణే క‌మిష‌న్ ప‌ర‌మావ‌ధి

Satyam News

కొమరవెల్లి మల్లన్న ఆలయం అభివృద్ధి చేసింది మేమే

Satyam News

బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య..!

Satyam News

డ్రగ్స్ కేసులో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ అరెస్టు

Satyam News

షేక్ హసీనా నేరస్థురాలే: న్యాయస్థానం వెల్లడి

Satyam News

Leave a Comment