అల్లూరి జిల్లాలో మంగళవారం ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో ఆరుగురు మావోయిస్టులు హతమైనట్లు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ అమిత్ బర్డర్ తెలిపారు. ఈ ఎన్కౌంటర్ మారేడుమిల్లి మండలంలోని అటవీ ప్రాంతంలో ఉదయం 6.30 గంటల నుంచి 7 గంటల మధ్య చోటుచేసుకుంది. మావోయిస్టుల కీలక నాయకుడు, పలువురు పోలీసులపై దాడులకు సూత్రధారిగా భావించబడుతున్న మడ్వి హిడ్మా కూడా మరణించిన వారిలో ఉండొచ్చని ప్రాథమిక సమాచారం వచ్చినప్పటికీ, దీనిపై పోలీసులు లేదా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి నిర్ధారణ ఇవ్వలేదు. ఎన్కౌంటర్లో ఇద్దరు మహిళలు, నలుగురు పురుషులు మృతి చెందినట్లు ఎస్పీ తెలిపారు. ఈ ఆపరేషన్ను పోలీసు శాఖకు చెందిన పలు విభాగాల సంయుక్త బలగాలు చేపట్టినట్టు ఆయన వెల్లడించారు. అటవీ ప్రాంతంలో నిఘా చర్యల భాగంగా ఈ ఆపరేషన్ నిర్వహించగా, ఎదురుకాల్పుల్లో మావోయిస్టులు హతమైనట్లు పోలీసులు పేర్కొన్నారు.
previous post
next post
