శ్రీకాకుళంహోమ్

అల్లూరి జిల్లాలో ఎన్ కౌంటర్: 6 గురు హతం

#Encounter

అల్లూరి జిల్లాలో మంగళవారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు హతమైనట్లు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ అమిత్ బర్డర్ తెలిపారు. ఈ ఎన్‌కౌంటర్ మారేడుమిల్లి మండలంలోని అటవీ ప్రాంతంలో ఉదయం 6.30 గంటల నుంచి 7 గంటల మధ్య చోటుచేసుకుంది. మావోయిస్టుల కీలక నాయకుడు, పలువురు పోలీసులపై దాడులకు సూత్రధారిగా భావించబడుతున్న మడ్వి హిడ్మా కూడా మరణించిన వారిలో ఉండొచ్చని ప్రాథమిక సమాచారం వచ్చినప్పటికీ, దీనిపై పోలీసులు లేదా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి నిర్ధారణ ఇవ్వలేదు. ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మహిళలు, నలుగురు పురుషులు మృతి చెందినట్లు ఎస్పీ తెలిపారు. ఈ ఆపరేషన్‌ను పోలీసు శాఖకు చెందిన పలు విభాగాల సంయుక్త బలగాలు చేపట్టినట్టు ఆయన వెల్లడించారు. అటవీ ప్రాంతంలో నిఘా చర్యల భాగంగా ఈ ఆపరేషన్ నిర్వహించగా, ఎదురుకాల్పుల్లో మావోయిస్టులు హతమైనట్లు పోలీసులు పేర్కొన్నారు.

Related posts

వంటగ్యాస్ రాలేదా? ఇవిగో కొత్త గైడ్ లైన్స్

Satyam News

మహర్షి భగీరథ జయంతి సందర్బంగా ఘన నివాళి

Satyam News

నిరాశ్రయ గృహం లో ఉచిత వైద్య శిబిరం

Satyam News

ఉత్తరాంధ్ర, రాయలసీమల్లో….. వైసీపీని పేల్చేసిన.. మావిగన్‌..!!

Satyam News

అయోధ్య రామమందిర విరాళాల చోరీ: 150 మంది దొంగలు?

Satyam News

వైసిపి కోవర్టుల అరాచకాలకు చెక్

Satyam News

Leave a Comment