25.2 C
Hyderabad
September 20, 2026
కృష్ణహోమ్

గుడివాడ పోలీసు స్టేషన్ లో జగన్ బంధువు

#ArjunReddy

కృష్ణా జిల్లా గుడివాడ టూ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో మాజీ సీఎం, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్‌ బంధువు సిరిగిరెడ్డి అర్జున్‌రెడ్డి విచారణ ముగిసింది. విచారణ అనంతరం అర్జున్‌రెడ్డి వైసీపీ నాయకులతో కలిసి పోలీస్‌ స్టేషన్‌ నుంచి వెళ్లిపోయారు.

ఈ సందర్భంగా గుడివాడ టూ టౌన్‌ పీఎస్‌ సీఐ హనీష్‌ మాట్లాడుతూ, సోషల్‌ మీడియాలో అభ్యంతరకర పోస్టులు చేసిన వ్యవహారంలో 2024లో సిరిగిరెడ్డి అర్జున్‌రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఆ కేసుకు సంబంధించి ఇటీవల ఆయనకు 41-ఏ నోటీసులు జారీ చేశామని చెప్పారు.

నోటీసుల నేపథ్యంలోనే నేడు అర్జున్‌రెడ్డిని పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించి విచారణ నిర్వహించినట్లు సీఐ హనీష్‌ వెల్లడించారు. కేసుకు సంబంధించిన అంశాలపై ప్రశ్నలు అడిగి వివరాలు సేకరించామని, అవసరమైతే తదుపరి విచారణ కూడా కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.

Related posts

ట్రంప్ హెచ్చరికలతో అట్టుడుకుతున్న గల్ఫ్

Satyam News

చిన జీయర్ కు శ్రీగురూజీ సవాల్

Satyam News

అమెరికాకు హెచ్చరికలు జారీ చేసిన ఇరాన్

Satyam News

సొంత ప్రభుత్వంపై ‘రాములమ్మ’ నిప్పులు!

Satyam News

కలుపు నివారణ మందు పారాక్వాట్ పై నిషేధం

Satyam News

ఏపీ ప్రభుత్వంపై కేటీఆర్ ప్రశంసల జల్లు

Satyam News

Leave a Comment