కృష్ణహోమ్

గుడివాడ పోలీసు స్టేషన్ లో జగన్ బంధువు

#ArjunReddy

కృష్ణా జిల్లా గుడివాడ టూ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో మాజీ సీఎం, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్‌ బంధువు సిరిగిరెడ్డి అర్జున్‌రెడ్డి విచారణ ముగిసింది. విచారణ అనంతరం అర్జున్‌రెడ్డి వైసీపీ నాయకులతో కలిసి పోలీస్‌ స్టేషన్‌ నుంచి వెళ్లిపోయారు.

ఈ సందర్భంగా గుడివాడ టూ టౌన్‌ పీఎస్‌ సీఐ హనీష్‌ మాట్లాడుతూ, సోషల్‌ మీడియాలో అభ్యంతరకర పోస్టులు చేసిన వ్యవహారంలో 2024లో సిరిగిరెడ్డి అర్జున్‌రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఆ కేసుకు సంబంధించి ఇటీవల ఆయనకు 41-ఏ నోటీసులు జారీ చేశామని చెప్పారు.

నోటీసుల నేపథ్యంలోనే నేడు అర్జున్‌రెడ్డిని పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించి విచారణ నిర్వహించినట్లు సీఐ హనీష్‌ వెల్లడించారు. కేసుకు సంబంధించిన అంశాలపై ప్రశ్నలు అడిగి వివరాలు సేకరించామని, అవసరమైతే తదుపరి విచారణ కూడా కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.

Related posts

జంగిల్ రాజ్ పై నిప్పులు చెరగిన మోడీ

Satyam News

వాల్ స్ట్రీట్ జర్నల్ కథనంపై భారత్‌లో ప్రకంపనలు!

Satyam News

శ్రీలక్ష్మిని భూమన అవమానిస్తే సాక్షి సిగ్గుపడిందా?

Satyam News

మెగా డీఎస్సీ నుంచి టీచర్ ట్రాన్స్ ఫర్ యాక్ట్ వరకూ…

Satyam News

కూపుచంద్రపేటలో ఫిబ్రవరి 2న స్నపన తిరుమంజనం

Satyam News

వారంలో పాస్ బుక్‌లు..రైతులకు చంద్రబాబు గుడ్‌న్యూస్

Satyam News

Leave a Comment