కృష్ణహోమ్

గుడివాడ పోలీసు స్టేషన్ లో జగన్ బంధువు

#ArjunReddy

కృష్ణా జిల్లా గుడివాడ టూ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో మాజీ సీఎం, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్‌ బంధువు సిరిగిరెడ్డి అర్జున్‌రెడ్డి విచారణ ముగిసింది. విచారణ అనంతరం అర్జున్‌రెడ్డి వైసీపీ నాయకులతో కలిసి పోలీస్‌ స్టేషన్‌ నుంచి వెళ్లిపోయారు.

ఈ సందర్భంగా గుడివాడ టూ టౌన్‌ పీఎస్‌ సీఐ హనీష్‌ మాట్లాడుతూ, సోషల్‌ మీడియాలో అభ్యంతరకర పోస్టులు చేసిన వ్యవహారంలో 2024లో సిరిగిరెడ్డి అర్జున్‌రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఆ కేసుకు సంబంధించి ఇటీవల ఆయనకు 41-ఏ నోటీసులు జారీ చేశామని చెప్పారు.

నోటీసుల నేపథ్యంలోనే నేడు అర్జున్‌రెడ్డిని పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించి విచారణ నిర్వహించినట్లు సీఐ హనీష్‌ వెల్లడించారు. కేసుకు సంబంధించిన అంశాలపై ప్రశ్నలు అడిగి వివరాలు సేకరించామని, అవసరమైతే తదుపరి విచారణ కూడా కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.

Related posts

ఉత్సాహంగా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ సమావేశం

Satyam News

అమరావతికి మరో భారీ గుడ్‌ న్యూస్‌…!!

Satyam News

లోకేష్‌ ను ఫాలో అవుతున్న జగన్‌, కేటీఆర్‌..

Satyam News

మమతా బెనర్జీ పాలనపై మోడీ తీవ్ర విమర్శలు…

Satyam News

మమతా బెనర్జీ ప్రభుత్వం డిస్మిస్ చేసిన గవర్నర్

Satyam News

రూ. 347 కోట్లతో జోగులాంబ దేవాలయ అభివృద్ధి

Satyam News

Leave a Comment