హైదరాబాద్హోమ్

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మేనకా గాంధీ

ప్రముఖ యానిమల్ రైట్స్ యాక్టివిస్ట్ మేనకా గాంధీ బృందం మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. మున్సిపాలిటీల పరిధిలో వీధి కుక్కలకు చేసిన, చేయనున్న స్టెరిలైజేషన్ వివరాలను అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వారి బృందానికి వివరించారు.

గోసంరక్షణకు ప్రభుత్వం ఇప్పటికే ప్రణాళికలు రూపొందించిన విషయాన్ని ఆమెకు వివరించారు. ఎన్కేపల్లిలో గోశాల నిర్మాణానికి శంకుస్ధాపన చేసిన విషయాన్ని తెలిపారు. రాష్ట్రంలో వివిధ ఆలయాల సమీపంలో గోశాలల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వివరించారు.

జంతు సంరక్షణ విషయంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యల పట్ల మేనకా గాంధీ సంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

Related posts

ఇరాన్ యుద్ధంపై త్వరలో శుభవార్త

Satyam News

ప్రపంచస్థాయి సాంకేతికతతో విపత్తు రక్షణ వ్యవస్థ బలోపేతం

Satyam News

జర్మనీలో కాల్పులు: ఐదు గురు మృతి

Satyam News

ఆడుకుంటూనే… గుండెపోటుతో చిన్నారి….

Satyam News

శాస్త్రోక్తంగా శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి తిరుమంజనం

Satyam News

‘ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్’ వ్యవస్థప్రారంభం

Satyam News

Leave a Comment