హైదరాబాద్హోమ్

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మేనకా గాంధీ

ప్రముఖ యానిమల్ రైట్స్ యాక్టివిస్ట్ మేనకా గాంధీ బృందం మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. మున్సిపాలిటీల పరిధిలో వీధి కుక్కలకు చేసిన, చేయనున్న స్టెరిలైజేషన్ వివరాలను అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వారి బృందానికి వివరించారు.

గోసంరక్షణకు ప్రభుత్వం ఇప్పటికే ప్రణాళికలు రూపొందించిన విషయాన్ని ఆమెకు వివరించారు. ఎన్కేపల్లిలో గోశాల నిర్మాణానికి శంకుస్ధాపన చేసిన విషయాన్ని తెలిపారు. రాష్ట్రంలో వివిధ ఆలయాల సమీపంలో గోశాలల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వివరించారు.

జంతు సంరక్షణ విషయంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యల పట్ల మేనకా గాంధీ సంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

Related posts

శ్రీ మదనగోపాలస్వామి ఆలయ పునఃప్రతిష్ట మహోత్సవం

Satyam News

పీ 4 పై దుష్ప్రచారం తగదు

Satyam News

భారత్-చైనా మధ్య విమాన సర్వీసులు పునఃప్రారంభం

Satyam News

తాటి ఈత వనాలు దగ్ధం కాకుండా మనమే చూసుకోవాలి

Satyam News

టీడీపీ నాయకుల్ని బహిష్కరించిన మత్స్యకారులు

Satyam News

MYTA: మలేషియా లో బతుకమ్మ సంబరాలు

Satyam News

Leave a Comment