26.3 C
Hyderabad
September 19, 2026
హైదరాబాద్హోమ్

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మేనకా గాంధీ

ప్రముఖ యానిమల్ రైట్స్ యాక్టివిస్ట్ మేనకా గాంధీ బృందం మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. మున్సిపాలిటీల పరిధిలో వీధి కుక్కలకు చేసిన, చేయనున్న స్టెరిలైజేషన్ వివరాలను అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వారి బృందానికి వివరించారు.

గోసంరక్షణకు ప్రభుత్వం ఇప్పటికే ప్రణాళికలు రూపొందించిన విషయాన్ని ఆమెకు వివరించారు. ఎన్కేపల్లిలో గోశాల నిర్మాణానికి శంకుస్ధాపన చేసిన విషయాన్ని తెలిపారు. రాష్ట్రంలో వివిధ ఆలయాల సమీపంలో గోశాలల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వివరించారు.

జంతు సంరక్షణ విషయంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యల పట్ల మేనకా గాంధీ సంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

Related posts

రూ. 84,000 కోట్ల పెట్టుబడులతో RMZ గ్రూప్‌

Satyam News

సింగరేణి కార్మికుల హక్కుల సాధనకు 20న నిరాహార దీక్ష

Satyam News

అల్మాస్ పేట్ అల్లర్లకు బాధ్యుడైన సీఐ పై బదిలీ వేటు

Satyam News

ఫేస్ బుక్ కు కష్టకాలం: జుకర్‌బర్గ్ కు మోడీ ప్రభుత్వం వార్నింగ్

Satyam News

ఏఐ టెక్నాలజీతో జీఎస్టీ వ్యవస్థలో లోపాలకు అడ్డుకట్ట

Satyam News

అమరావతి ఇక అఖండ జ్యోతి!

Satyam News

Leave a Comment