నెల్లూరుహోమ్

పేదల కల సాకారం.. రేపే ఏపీలో మహా గృహ సంబరం!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. “ప్రతీ పేదవాడికి ఒక నీడ” ఉండాలనే లక్ష్యంతో అడుగులు వేస్తున్న కూటమి ప్రభుత్వం, కేవలం 21 నెలల వ్యవధిలోనే 5.50 లక్షల ఇళ్లను లబ్ధిదారులకు అందించి సరికొత్త రికార్డు సృష్టించబోతోంది!

గతేడాది నవంబర్‌లో రాయచోటి వేదికగా 3 లక్షల ఇళ్లను అందించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఇప్పుడు రెండో విడతగా రాష్ట్రవ్యాప్తంగా ఏకకాలంలో 2.5 లక్షల మందికి గృహ ప్రవేశాలు చేయించబోతున్నారు.

వేదిక: పుదూరు (నాయుడుపేట మండలం), సూళ్లూరుపేట నియోజకవర్గం.

ముఖ్య అతిథి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.

విశేషం: 1 లక్ష టిడ్కో ఇళ్లతో పాటు, మరో 1.50 లక్షల గృహాలకు పేదలు యజమానులు అవుతున్నారు.

“ఇది కేవలం ఇళ్ల పంపిణీ కాదు.. పేదల ఆత్మగౌరవ ప్రతీక!” ఈ నినాదంతో రేపు రాష్ట్రమంతా పండుగ వాతావరణం నెలకొననుంది.

Related posts

మర్డర్ కు దారితీసిన క్రికెట్ మ్యాచ్

Satyam News

తెలంగాణ విద్వత్సభ దశాబ్ది మహోత్సవాలు

Satyam News

మెగాస్టార్ కు తొలి పత్రిక ఇచ్చిన అల్లు శిరీష్

Satyam News

పెరిగిన ప్రీమియర్ పెట్రోలు ధరలు

Satyam News

విధి నిర్వహణలో ఉన్న అధికారిపై కండక్టర్ ‘అటాక్’

Satyam News

వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు

Satyam News

Leave a Comment