కరీంనగర్హోమ్

మహిళా సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తున్నాం

#PonnamPrabhakar

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని అక్కాచెల్లెళ్లకు మరియు ఆర్టీసీ మహిళా సిబ్బందికి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా పాలన ప్రభుత్వం కొలువుదీరిన 48 గంటల్లోనే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించామని, తద్వారా మహిళలను బస్సులకు యజమానులను చేశామని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తోందని, మహిళలు అన్ని రంగాల్లో రాణించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆయన ఆకాంక్షించారు.

మహాలక్ష్మి పథకం ద్వారా ఇప్పటివరకు మహిళలు సుమారు 282 కోట్ల జీరో టికెట్ ప్రయాణాలు చేశారని, దీనివల్ల వారు దాదాపు 9,700 కోట్ల రూపాయలను ఆదా చేసుకున్నారని మంత్రి వివరించారు. మహిళా సాధికారతను మరింత బలోపేతం చేసేందుకు మండల మహిళా సమాఖ్యల ద్వారా కొత్త బస్సుల కొనుగోలు ప్రక్రియను చేపట్టామని తెలిపారు. రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే మహోన్నత లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తోందని, ఇందులో భాగంగా ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు, వడ్డీ లేని రుణాలు, స్వయం సహాయక సంఘాలకు ఉపాధి అవకాశాల కల్పన వంటి ఎన్నో పథకాలకు శ్రీకారం చుట్టినట్లు వెల్లడించారు.

మహిళా సంక్షేమమే కేంద్రంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్, సన్న బియ్యం పంపిణీ, నూతన రేషన్ కార్డుల మంజూరు వంటి ప్రజాహిత కార్యక్రమాలను అమలు చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ గుర్తుచేశారు. మహిళలు ఆర్థిక వృద్ధి సాధించి, సమాజంలో గౌరవప్రదంగా ఎదగాలన్నదే ప్రభుత్వ సంకల్పమని పేర్కొంటూ, తన సోదరీమణులందరికీ మరోమారు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

Related posts

రష్యా అధ్యక్షుడిని కూడా అమెరికా బంధిస్తుందా?

Satyam News

అమరావతిలో L&T పైపులకు నిప్పు పెట్టింది ఎవరు?

Satyam News

నటకిరీటి డా: రాజేంద్ర ప్రసాద్ “నేనెవరు?” టైటిల్ లోగో లాంచ్

Satyam News

వైభవంగా శ్రీ పరమేశ్వర లింగం శ్రీ పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ

Satyam News

రూ 4.82 కోట్ల విలువైన చైనా బాణసంచా పట్టివేత

Satyam News

వైభోగ జీవితంలోని కాళ రాత్రులు!

Satyam News

Leave a Comment