విశాఖపట్నంహోమ్

ఏడు నెలల గర్భిణి, భర్త ఆత్మహత్య

విశాఖపట్నం నగరంలో దారుణం చోటుచేసుకుంది. భార్యాభర్తలు ఇద్దరూ ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందారు. మృతురాలు ఏడు నెలల గర్భిణి కూడా కావడం ఈ ఘటనకు మరింత విషాదాన్ని కలిగించింది. ఈ సంఘటన అక్కయ్యపాలెం, ధాలి రాజు సూపర్ మార్కెట్ ఆపోజిట్ సంఘం ఆఫీస్ వద్ద చోటుచేసుకుంది.

ఆత్మహత్య చేసుకున్న దంపతులను పోలీసులు అనిత (25), వాసు (34)గా గుర్తించారు. భర్త వాసు ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని మృతి చెంది ఉండగా, భార్య అనిత కింద పడి చనిపోయి ఉంది. అనిత ఏడు నెలల గర్భవతి అని పోలీసులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న ఫోర్త్ టౌన్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

మృతదేహాలను పరిశీలించి కేసు నమోదు చేశారు. దంపతులు ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు, పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

నటకిరీటి డా: రాజేంద్ర ప్రసాద్ “నేనెవరు?” టైటిల్ లోగో లాంచ్

Satyam News

రేపే 9 వ విడత ఉచిత కంటి వైద్య శిబిరం

Satyam News

ప్యాలెస్ మారుతున్న జగన్: లోటస్‌పాండ్‌పై దండయాత్ర!

Satyam News

హానీ ట్రాప్ తో లేడీ “కేడీ” టోకరా….

Satyam News

సిసి రోడ్డు పనులను ప్రారంభించిన మార్కెట్ కమిటీ చైర్మన్

Satyam News

బకారంలో రేవ్ పార్టీ భగ్నం చేసిన పోలీసులు

Satyam News

Leave a Comment