విశాఖపట్నంహోమ్

ఏడు నెలల గర్భిణి, భర్త ఆత్మహత్య

విశాఖపట్నం నగరంలో దారుణం చోటుచేసుకుంది. భార్యాభర్తలు ఇద్దరూ ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందారు. మృతురాలు ఏడు నెలల గర్భిణి కూడా కావడం ఈ ఘటనకు మరింత విషాదాన్ని కలిగించింది. ఈ సంఘటన అక్కయ్యపాలెం, ధాలి రాజు సూపర్ మార్కెట్ ఆపోజిట్ సంఘం ఆఫీస్ వద్ద చోటుచేసుకుంది.

ఆత్మహత్య చేసుకున్న దంపతులను పోలీసులు అనిత (25), వాసు (34)గా గుర్తించారు. భర్త వాసు ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని మృతి చెంది ఉండగా, భార్య అనిత కింద పడి చనిపోయి ఉంది. అనిత ఏడు నెలల గర్భవతి అని పోలీసులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న ఫోర్త్ టౌన్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

మృతదేహాలను పరిశీలించి కేసు నమోదు చేశారు. దంపతులు ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు, పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

సూర్యలంక బీచ్ లో అభివృద్ధి పనులు

Satyam News

తెలంగాణ పోలీస్ అకాడమీలో మహారాష్ట్ర పోలీస్ ల స్టడీ విజిట్

Satyam News

రూ.40 లక్షల నిధులతో ఆత్కూరు డ్రైన్

Satyam News

అమెరికాలో ఊపేస్తున్న అఖండ 2

Satyam News

అంగరంగ వైభవంగా భీమవరం టాకీస్ 15 చిత్రాలు ప్రారంభం

Satyam News

శివ‌రాత్రి సంద‌ర్బంగా గ‌ట్టి బందోబ‌స్త్‌

Satyam News

Leave a Comment