ప్రకాశంహోమ్

సూర్యలంక తీరం లో మరో రెండు రోజుల పాటు నిషేధం

బాపట్ల రూరల్ పోలీస్ స్టేషన్ నందు రూరల్ సీఐ శ్రీనివాసరావు ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి బాపట్ల డిఎస్పి రామాంజనేయులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా బాపట్ల డిఎస్పీ రామాంజనేయులు మాట్లాడుతూ కార్తీక మాసం సందర్భంగా బాపట్ల జిల్లా బాపట్ల సూర్యలంక,పాండురంగపురం సముద్ర తీరానికి వచ్చే భక్తులు పర్యటకులకు మరో రెండు రోజులపాటు అనుమతి లేదని తెలియజేయడానికి చింతిస్తున్నామని అన్నారు. మంథా తుఫాన్ ప్రభావం వలన తీరంలో కెరటాలు ఎగసి పడినందున గుంటలు ఏర్పడ్డాయని ఫిషరీస్, గజేతగాళ్ల ద్వారా తీరం పరిశీలించడం జరిగిందని తద్వారా జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, ఎస్పీ ఉమామహేశ్వర్ నిర్ణయం తీసుకుని సూర్యలంక తీరం తాత్కాలికంగా మూసివేయాలని ఆదేశాలు జారీ చేసినందున మరో రెండు రోజులపాటు తీరానికి రాకపోకలు నిషేధించబడినదని తెలిపారు.

ఈ సందర్భంగా గుంటూరు,పల్నాడు, విజయవాడ, హైదరాబాదు దూర ప్రాంతాల నుండి వచ్చే వారు మరల అధికారులు ఆదేశాలు జారీ చేసే వరకు సహకరించాలని కోరారు. ఈ సమావేశం లో రూరల్ సీఐ శ్రీనివాస్ రావు, ఎస్సై శ్రీనివాస్ రావు ఉన్నారు.

Related posts

పరిశ్రమల మనుగడకు పటిష్ట నీటి నిర్వహణే కీలకం

Satyam News

ఉపరాష్ట్రపతి ఎన్నికకు బీజేపీ మీటింగ్

Satyam News

ఐబొమ్మ రవికి బెయిల్: నెక్ట్స్ ఏంటీ?

Satyam News

సిట్ నోటీసులు చిల్లర రాజకీయాలే

Satyam News

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దాడి వెనుక పిన్నెల్లి సోదరులు?

Satyam News

మైనర్ బాలిక తల్లి బహిరంగ ప్రకటన ఇది….

Satyam News

Leave a Comment