తిరుపతి తిరుమల కొండపై బుధవారం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి ముందు, తర్వాత ఇబ్బందులు వచ్చాయని భక్తులు తెలిపారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1లోని 18వ కంపార్ట్ మెంట్ లో పోలీస్ చెకింగ్ తర్వాత తోపులాట జరిగింది. అక్కడ ఒక సెక్యూరిటీ సిబ్బందిని, ఇద్దరు శ్రీ వారి సేవకులను నియమించాలని, పోలీస్ చెకింగ్ పూర్తయిన తర్వాత బారికేడ్ ఏర్పాటు చేసి తోపులాట లేకుండా దర్శనానికి పంపాలని కోరారు.
బుధవారం మధ్యాహ్నం 1 నుండి 2 గంటల మధ్య దర్శనం చేసుకున్న తర్వాత శ్రీ వారి హుండీ ఎదురుగా సబేరా ముందు 20 నిముషాలు నిలబెట్టారని, హుండీలో డబ్బులు వేయడానికి తోపులట అయిందని, బయటకు వెళ్ళడానికి తోపులాట అయిందని భక్తులు చెప్పారు. తోపులాట లేకుండా బయటకు పంపాలని, బారికేడ్లు ఏర్పాటు చేసి శ్రీ వారి సేవకులను నియమించాలని కోరారు.
సిసి కెమెరాల ద్వారా పర్యవేక్షణ చేయాలని, అధికారులు ఎసి గదులు, ఎసి వాహనాలు వదిలి తనిఖీ చేయాలని కోరారు. విఐపిలు, ప్రముఖులు స్వామి వారిని దర్శించుకున్నారని వార్తలు రాయడం బంద్ చేసి ఇబ్బందులు, సమస్యల గురించి పత్రికల్లో రాయాలని కోరారు. పిఎసి-4. కౌంటర్ 5 లగేజీ దగ్గర నాలుగు కౌంటర్లు ఉన్నాయి. కాని ఒక కౌంటర్ పని చేసింది.తిరుపతిలోని శ్రీనివాసం గెస్ట్ హౌస్ లో బి బ్లాక్ దగ్గర ఒక లిఫ్ట్ పని చేసింది.
యాత్రికులు ఇబ్బందులకు గురయ్యారు. అన్ని లిఫ్ట్ లు పని చేసే విదంగా చర్యలు తోసుకోవాలని భక్తులు కోరారు. తిరుమల కొండపై పరిశుభ్రత బాగుంది. నాణ్యమైన భోజనం వసతి బాగుంది. దేశంలో నెంబర్ వన్.కాని చిన్న సమస్యలు నిమిషాల్లో పరిష్కారం చేసే సత్తా అధికారులకు ఉంది. కాని చేయడం లేదు ఎందుకో.
పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్
