25.2 C
Hyderabad
September 20, 2026
ఆధ్యాత్మికంహోమ్

శ్రీ ల‌క్ష్మీ వెంక‌టేశ్వ‌ర‌స్వామి వారి ఆల‌యంలో సంప్రోక్షణ

#DevuniKadapa

దేవుని క‌డ‌ప శ్రీ ల‌క్ష్మీ వెంక‌టేశ్వ‌ర‌స్వామి వారి ఆల‌యంలో బాలాలయ సంప్రోక్షణ కార్యక్రమాలు మంగ‌ళ‌వారం ఉద‌యం ఆగమోక్తంగా ప్రారంభమయ్యాయి. ఆగ‌ష్టు 20వ తేదీన మహాసంప్రోక్షణతో ముగియనున్నాయి. ఇందులో భాగంగా ఉద‌యం 8 గంట‌లకు యాగ‌శాల‌లో వైదిక కార్య‌క్ర‌మాలు, శాంతి హోమం, వాస్తు హోమం నిర్వ‌హించారు.

సాయంత్రం 5.30 గంట‌ల‌కు కళాకర్షణలో భాగంగా గర్భాలయంలోని శ్రీ ల‌క్ష్మీ వేంక‌టేశ్వ‌ర‌స్వామి వారి మూల‌మూర్తి శ‌క్తిని కుంభంలోకి ఆవాహ‌న చేసి యాగ‌శాల‌లో ప్ర‌తిష్టించి ఆరాధ‌న‌లు చేప‌డ‌తారు. ఆగ‌స్టు 20వ తేదీన‌ ఉద‌యం 9.30 గంట‌లకు మ‌హాపూర్ణాహుతి, ఉదయం 10 నుంచి 11.15 గంటల మధ్య తులా లగ్నంలో బాల బింబ‌ ప్ర‌తిష్ట‌, బాలాలయ సంప్రోక్షణ నిర్వహిస్తారు. ఈ కార్య‌క్ర‌మంలో డెప్యూటీ ఈవో ప్ర‌శాంతి, సూప‌రిండెంట్ హ‌నుమంత‌య్య‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ ఈశ్వ‌ర్ రెడ్డి, అర్చ‌కులు పాల్గొన్నారు.

Related posts

గవర్నర్‌ను కలిసిన నూతన సీఎస్ సంజయ్ జాజు

Satyam News

దర్శకుడు పిసి ఆదిత్య కు దాసరి నారాయణరావు స్మారక పురస్కారం

Satyam News

విశాఖకు తరలి వచ్చిన కాగ్నిజెంట్

Satyam News

గోదావరి పుష్కరాలపై అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి

Satyam News

గంజాయి రవాణాపై ఉక్కుపాదం

Satyam News

‘కలలకు రెక్కలు’ పథకంతో విదేశీ విద్యకు సహకారం

Satyam News

Leave a Comment