మొయినాబాద్ ఫామ్హౌస్లో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ను పోలీసులు అరెస్టు చేశారు. డ్రగ్స్ పార్టీలో కొకైన్, రివాల్వర్ స్వాధీనం చేసుకోగా, టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్కు డ్రగ్స్ టెస్టులో నెగెటివ్ వచ్చింది.
మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి డ్రగ్స్ టెస్టులో పాజిటివ్ వచ్చినట్లు సమాచారం. అలాగే, నమిధ్ మిశ్రా, అర్జున్ రెడ్డి, కౌశిక్ రవికి కూడా డ్రగ్స్ టెస్టులో పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ ఫామ్హౌస్ పార్టీలో మొత్తం 11 మంది వ్యక్తులు పాల్గొన్నారు.
