మహబూబ్ నగర్హోమ్

గద్వాల పట్టణంలో సావిత్రిబాయి పూలే 129వ వర్ధంతి

#Gadwal

జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో మధ్యాహ్నం ఎమ్మార్పీఎస్, మాల మహానాడు సంఘాల  ఆధ్వర్యంలో గద్వాల పట్టణంలో దళిత సంఘాల ఐక్యవేదిక కార్యాలయం దగ్గర సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలతో ఘన నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే ఆమె భర్త జ్యోతిబాపూలే సామాజిక సేవలో పాల్గొంటూ చిన్నతనములోనే ఈ భారతదేశం లో మొట్టమొదటి చదువుల తల్లిగా కొనియాడబడిందని తెలిపారు. ఆ కాలంలోనే స్త్రీలకు విద్య లేదని మనువాదులు విద్యకు దూరం ఉంచిన సమయంలో తన భర్త జ్యోతిరావు పూలే ప్రోత్సాహంతో చదువుకున్నారని తెలిపారు.

దేశంలో మొట్టమొదటి బాలికల పాఠశాలను ఏర్పాటు చేసి విద్య లేని మహిళలకు విద్యను బోధిస్తూ వారికి సమాజంలో ఉన్న రుగ్మతలను ఎలా ఎదుర్కోవాలో నేర్పిన సామాజిక సేవకురాలు సావిత్రిబాయి అని వక్తలు కొనియాడారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు కుంకల భీమన్న, మాల మహానాడు రాష్ట్ర నాయకులు మాల శ్రీనివాసులు, ఎమ్మార్పీఎస్ జిల్లా సీనియర్ నాయకులు అశోక్ మాదిగ, ఐజ ఆంజనేయులు మాదిగ, డ్యాం హనుమంతు, మేస్త్రి కృష్ణ, కాలేజీ విద్యార్థినిలు మరియు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.

Related posts

డయాబెటిస్ కు చికిత్స కనిపెట్టిన చైనా

Satyam News

పాస్‌పోర్ట్ సేవల్లో తెలంగాణ పోలీసులకు జాతీయ గుర్తింపు

Satyam News

ఇమ్రాన్ ఖాన్ కు వెసులుబాటు కల్పించిన సుప్రీంకోర్టు

Satyam News

ఉత్త‌రాంధ్ర చ‌రిత్ర పుట‌ల్లో సువ‌ర్ణాక్ష‌రాల‌తో లిఖించే రోజు

Satyam News

సిగ్నల్‌ రహిత ప్రయాణమే లక్ష్యంగా 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌ లు

Satyam News

కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో లోకేష్‌ భేటీ సీక్రెట్‌..?

Satyam News

Leave a Comment