కృష్ణహోమ్

బొండా ఉమా వివరణ తీసుకోండి.. చంద్రబాబు ఆదేశాలు

#BondamUma

వైకాపా నేతలతో కలిసి వేదికను పంచుకోవడంపై.. తెదేపా ఎమ్మెల్యే బొండా ఉమా నుంచి వివరణ తీసుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఇందుకు సంబంధించిన బాధ్యతను తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి నిమ్మల రామానాయుడికి అప్పగించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లను నిత్యం బజారు భాషలో దూషించే విపక్ష నేత అంబటి రాంబాబుతో బొండా ఉమా వేదిక పంచుకోవడం శ్రేణులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. కూటమిని, ముఖ్యంగా పవన్ కళ్యాణ్‌ను వ్యక్తిగతంగా దూషించిన శత్రువుతో ముచ్చట్లు పెడుతూ చిరునవ్వులు చిందించడం పట్ల తెలుగు దేశం , జనసేన రెండు వర్గాల్లో ఆగ్రహం వ్యక్తం అయింది.

కూటమి ప్రభుత్వంపై కాపుల్లో ఉన్న అపారమైన నమ్మకాన్ని సడలించేలా ప్రవర్తించడం అంటే తిన్నింటి వాసాలు లెక్కపెట్టడమే అని ,ఇది పొత్తు ధర్మానికి, పార్టీ నిబంధనలకు తీవ్ర విఘాతం కలిగించడమే అని విమర్శలు తలెత్తాయి. అయితే, ఈ నోటీసులకు ఆయన ఎలాంటి వివరణ ఇస్తారో కానీ, పార్టీ నిబంధనలను బహిరంగంగా ఉల్లంఘించిన బొండా ఉమా తీరుపై సొంత పార్టీ నేతలు, కూటమి శ్రేణుల నుంచి తీవ్ర ఆగ్రహజ్వాలలు వ్యక్తమవుతున్నాయి.

Related posts

ఆవుల‌ను త‌ర‌లిస్తే ఖ‌బ‌డ్దార్‌: అర్ద‌రాత్రి ఎస్పీ త‌నిఖీలు

Satyam News

ఇంటి స్థలం కోసం మంత్రిని కలిసిన తెలంగాణ ఉద్యమకారులు

Satyam News

యువత గొంతు నొక్కితే బీజేపీ రాజకీయ పతనం తప్పదు

Satyam News

ఇండోనేషియాలో ఘోర ప్రమాదం: 41 మంది మృతి?

Satyam News

పెళ్లైన 38 రోజులకే భర్తను చంపిన భార్య

Satyam News

వైసీపీని భయపెట్టిన జగన్‌ టూర్‌…!!

Satyam News

Leave a Comment