హైదరాబాద్హోమ్

పరారీలో ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్‌కృష్ణారెడ్డి

#UdaiKrishnareddyIPS

మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఆరోపణలతో ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్‌కృష్ణారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధిత మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సంబంధిత చట్టాల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

కేసు నమోదు అనంతరం ఉదయ్‌కృష్ణారెడ్డి పరారీలో ఉన్నట్లు సమాచారం. గత రెండు రోజులుగా ఆయనకు నోటీసులు అందజేయడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నప్పటికీ, హైదరాబాద్‌లో ఆయన పేర్కొన్న రెండు చిరునామాల్లోనూ ఆచూకీ లభించలేదు.

దీంతో ఆయన కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తుండగా, ఉదయ్‌కృష్ణారెడ్డి ఆచూకీ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడికావాల్సి ఉంది.

Related posts

కాంగ్రెస్ అధికార దుర్వినియోగానికి పరాకాష్ట

Satyam News

జగన్‌ని భయపెడుతున్న ఇండియా టుడే సర్వే

Satyam News

హవాలా మార్గంలో ‘కల్తీ నెయ్యి’ సొమ్ము

Satyam News

దుబాయ్ ఎయిర్ షో లో ప్రమాదం

Satyam News

సాగునీటి సంఘాల అధ్యక్షులతో త్వరలో సమావేశం

Satyam News

హోర్మోజ్ జలసంధి నుంచి భారత్ కు మరో రెండు నౌకలు

Satyam News

Leave a Comment