ఆధ్యాత్మికంహోమ్

కూపుచంద్రపేటలో ఫిబ్రవరి 2న స్నపన తిరుమంజనం

#Tirumala

తిరుపతి శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలోని స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఫిబ్రవరి 2వ తేదీన కూపుచంద్రపేట గ్రామానికి ఊరేగింపుగా తీసుకెళ్లనున్నారు. శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామివారి ఉత్సవమూర్తులు ఉదయం 6 గంటలకు ఆలయం నుండి ఊరేగింపుగా బయల్దేరి తిరుపతికి 8 కిలోమీటర్ల దూరంలో గల కూపుచంద్రపేటకు ఉదయం 9.30 గంటలకు చేరుకుంటారు.

అనంతరం స్వామి, అమ్మవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం 4 నుండి 5 గంట‌ల వ‌ర‌కు ఊంజ‌ల్ సేవ‌, సాయంత్రం 5 గంట‌లకు గ్రామోత్స‌వం నిర్వ‌హించి, తిరిగి ఆలయానికి చేరుకుంటారు. ప్రతి సంవత్సరం మాఘమాసం పౌర్ణమి సందర్భంగా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఉదయం, సాయంత్రం జరిగే స్వామివారి ఊరేగింపులో టీటీడీ హిందూధర్మ ప్రచార పరిషత్‌, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో భజనలు, కోలాటాలు నిర్వహించనున్నారు.

Related posts

జగన్ హయాంలో భారీ ‘విద్యుత్’ కుంభకోణం

Satyam News

కొత్త ఇళ్ల కోసం ఎదురుచూసేవారికి తీపికబురు

Satyam News

ముంచుకొస్తున్న ‘మొంథా’ తుఫాన్

Satyam News

ముచ్చ‌ట‌గా మూడోసారి జొన్న‌గుడ్డి లో కార్డ‌న్ సెర్చ్‌

Satyam News

సింగపూర్ ‘ట్రీ లేడీ’ ఆకస్మిక మరణం

Satyam News

రంజాన్ సందర్భంగా రేవంత్ ఇఫ్తార్ విందు

Satyam News

Leave a Comment