ఆదిశిలా క్షేత్రం మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శనివారం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి ముక్కులు సమర్పించుకున్నారు. శ్రీ తిమ్మప్ప స్వామి గోవిందరాజస్వామి లక్ష్మీదేవి ఈశ్వర ఆలయాలలో విశేష పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా దేవాలయానికి వచ్చిన భక్తులకు అన్నదాన సత్రంలో నాగర్ దొడ్డి గ్రామానికి చెందిన పరుశురాముడు శారదమ్మ సమారన్న రాజేశ్వరి దంపతులు అన్నదానం ఏర్పాటుచేయగ ఆలయ చైర్మన్ శ్రీకృష్ణ మాన్య పట్వారి ప్రహ్లాద రావు ఈవో సత్య చంద్రారెడ్డి ఆధ్వర్యంలో పూజలు నిర్వహించి భక్తులకు అన్నదానం చేశారు.
ఈ సందర్భంగా అన్నదానం చేసిన దాతలకు స్వామివారి శేష వస్త్రం చిత్రపటాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో చంద్రశేఖర రావు, రవి, చంద్రశేఖర్ రెడ్డి, సర్పంచ్ భర్త గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
