ఆధ్యాత్మికంహోమ్

చిన జీయర్ కు శ్రీగురూజీ సవాల్

సనాతన ధర్మం గురించి పలువురు పలు రకాలుగా వ్యాఖ్యలు చేయడాన్ని శ్రీ స్వామి రామానంద యోగజ్జాన పీఠాధిపతి అంతర్ముఖానంద శ్రీగురూజీ తీవ్రంగా ఖండించారు. ఏపీలోని విజయనగరం జిల్లా బాడంగి మండలం కామన్నవలస ఆశ్రమంలో జగద్గురు ఆది శంకరాచార్యుల జయంతి మంగళవారం జరిగింది.

ఈ సందర్బంగా ఆశ్రమంలో శ్రీగురూజీ ప్రవచనలు చేస్తూ ఇటీవల చిన జీయర్ ధర్మం గురించి చేసిన వ్యాఖ్యలు, అలాగే సినీ నటుడు ప్రకాష్ రాజే రామ, లక్ష్మణులపై వాగిన దాన్ని తీవ్రంగా ఖండించారు. ఆది శంకరుల జయంతి సందర్బంగా ఆశ్రమం లో తెల్లవారుజామున అఖండ జపం, పొద్దున్న సద్గురు పూజ ఆదిశంకరుల సహస్రం పఠించారు. అటు శ్రీ స్వామిజీ సమాధి మందిరంలో ఇటు ఆశ్రమం పీఠంలో పూజ జరిగింది.

అనంతరం అల్పాహారం అయినా తరువాత శ్రీ గురూజీ దాదాపు రెండున్నర గంటల పాటు బౌద్ధిక్ ఇచ్చారు. ఈ కార్యక్రమం లో శివ, రమేష్, శంకరరావు, చక్రవర్తి, విజయ్ గోపాల్, లక్ష్మణరావు,మనోహర్,డాక్టర్ సుబ్రహ్మణ్యం, డాక్టర్ హరగోపాల్ తో పాటు విజయవాడ, ఒంగోలు హైదరాబాద్ ల నుండీ శిష్యులు పాల్గొన్నారు.

Related posts

షేక్ హసీనా నేరస్థురాలే: న్యాయస్థానం వెల్లడి

Satyam News

45 ఏళ్లకే బీజేపీ జాతీయ అధ్యక్షుడు: చరిత్ర సృష్టించిన నితిన్

Satyam News

అసదుద్దీన్ కు కీలక పదవి ఇచ్చిన బీజేపీ

Satyam News

ప్రపంచస్థాయి ప్రమాణాలతో నిడమర్రు మోడల్ స్కూల్

Satyam News

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ క్షమాపణ చెప్పాలి

Satyam News

మోస్ట్ వాంటెడ్ అంతర్రాష్ట్ర దొంగ ‘పొట్టి రఫీ’ అరెస్ట్

Satyam News

Leave a Comment