ఆధ్యాత్మికంహోమ్

శ్రీ మదనగోపాలస్వామి ఆలయ పునఃప్రతిష్ట మహోత్సవం

#ChintamaneniPrabhakar

ధర్మ పరిరక్షణ మరియు భక్తి భావనతోనే సమాజం సుభిక్షంగా ఉంటుందని దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ పేర్కొన్నారు. గురువారం పెదవేగి మండలం దుగ్గిరాల గ్రామంలో వేంచేసియున్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ మదనగోపాల స్వామి వారి ఆలయ పునఃప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తన ధర్మపత్ని చింతమనేని రాధారాణి(రాధమ్మ) తో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యే చింతమనేని దంపతులకు ఆలయ నిర్వాహకులు, అర్చకులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే చింతమనేని దంపతులు నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని కాంక్షిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం వేద పండితులు ఎమ్మెల్యే దంపతులకు వేద ఆశీర్వచనం అందించి, స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ దుగ్గిరాల గ్రామంలో ఈనెల 7,8 ,9 తేదీల్లో అనగా  గురు, శుక్ర, శనివారాల్లో మూడు రోజుల పాటు ఈ పునఃప్రతిష్ట మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. శనివారం మధ్యాహ్నం భక్తులందరికీ భారీ అన్న సమారాధన కార్యక్రమం ఉంటుందని,  భక్తులు ఈ మహోత్సవాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు.

ఆలయాల రక్షణకు మరియు సమాజంలో ధర్మ పరిరక్షణకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆధ్యాత్మిక చింతనతోనే ప్రశాంతమైన జీవనం సాధ్యమని, మన సంస్కృతిని, సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, పెద్ద సంఖ్యలో భక్తులు మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు.

Related posts

జొన్నగిరి బంగారంతో కొత్త ఆశలు

Satyam News

అజేయ కల్లం రియల్ దందా..అన్నవరంలో భూ దోపిడీ!

Satyam News

యూ టర్న్ తీసుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు

Satyam News

రేవంత్ ప్రభుత్వ పాలసీలు తుగ్లక్ పాలసీలు

Satyam News

నందమూరి బాలకృష్ణ చొరవతో జాబ్ మేళా

Satyam News

క్వాంటం టెక్నాలజీకి అమరావతి లాంచ్ పాడ్

Satyam News

Leave a Comment